టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ చట్ట విరుద్ధం
19 Sep 2020 11:30 AM
సమన్యాయ భావనకు ఇది పూర్తి వ్యతిరేకం
ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల కుంభకోణం కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ చట్ట విరుద్ధమని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిందన్నారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ చట్ట విరుద్ధమని, మీడియా గ్యాగింగ్ రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ తీర్పు సమన్యాయ భావనకు పూర్తి వ్యతిరేకంగా ఉందన్నారు. ఆర్టికల్ 14 ప్రకారం హైకోర్టుకు ఈ అధికారం లేదన్నారు.
నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి: ఎంపీ మిథున్ రెడ్డి
అమరావతి భూ కుంభకోణం కేసులో నిష్పక్షపాత దర్యాప్తు సీబీఐ విచారణ జరగాలని లోక్సభలో వైయస్ఆర్సీపీ నేత మిథున్రెడ్డి కోరారు. రాష్ట్ర బీజేపీ సైతం అమరావతి భూ స్కాంపై సీబీఐ విచారణ కోరుతుందన్నారు. అలాగే ఏపీ ఫైబర్ గ్రిడ్లో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఈ రెండింటిపై సీబీఐ విచారణ జరిపించాలని మిథున్రెడ్డి లోక్సభలో కోరారు.