కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఆ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి
29 Dec 2021 1:15 PM
టీడీపీ, బీజేపీలపై వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం
పేదల కోసమే సర్కారు టికెట్ రేట్లు తగ్గించింది తిరుపతి: తెలుగు దేశం, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విజయవాడలో బీజేపీ నిర్వహించిన జనాగ్రహ సభపై ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ ఆ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు తెలుగుదేశం, బీజేపీపైనే ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. ఈ రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేసింది ఆ రెండు పార్టీలేనని ఆమె మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని అన్నారు. టీడీపీ నేతలే బీజేపీలో చేరారని, టీడీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టుని బీజేపీ నేతలు చదివి వినిపిస్తున్నారని ఆమె చెప్పారు.
ఉన్న పరువుని కూడా బీజేపీ నేతలు పోగొట్టుకుంటున్నారని ఆమె అన్నారు. బీజేపీ నేతలు విభజన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు తమపైనే ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆమె అన్నారు. ఆగ్రహిస్తే ప్రజలు ఆ రెండు పార్టీలపైనే ఆగ్రహిస్తారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించడంపై రోజా మాట్లాడుతూ... ఏపీలోని పేద ప్రజల కోసమే వైయస్ఆర్ సీపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. వైయస్ జగన్ లాంటి స్నేహపూర్వకమైన సీఎంను మనం ఎక్కడా చూసి ఉండమని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జునతో పాటు ఇతర సినీ పెద్దలు ఆన్లైన్ టికెట్ విధానం తీసుకురావాలని చాలాసార్లు కోరారని ఆమె అన్నారు.
వారి విజ్ఞప్తి మేర సీఎం జగన్ అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. టాలీవుడ్ పెద్దలతో చర్చలు జరిపిన అనంతరమే నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ఈ విషయంపై కొందరు రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. ఈ విషయాన్ని గ్రహిస్తోన్న సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే చర్చలకు వస్తున్నారని ఆమె తెలిపారు.