వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది

మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస్  

విజయవాడ:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం అన్ని మ‌తాల‌ను స‌మానంగా గౌర‌విస్తుంద‌ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. హిందూ ఆచార్య సభ, సేవ్ టెంపుల్స్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. దేవాలయ రాజకీయాలతో ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర చేస్తున్నారన్నారు. సీఎం వైయ‌స్ జగన్ ప్రభుత్వంపై కొందరు స్వామీజీల తీరు బాధాకరమన్నారు. దేవాలయాల రక్షణ బాధ్య‌త ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌జ‌లు కూడా తీసుకోవాల‌న్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల కేసుల్లో 300 మందిని అరెస్ట్‌ చేశామ‌ని మంత్రి చెప్పారు.  

Back to Top