కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి
01 Dec 2020 3:51 PM
ఆర్అండ్బీ శాఖ మంత్రి శంకర్ నారాయణ డిమాండ్
స్పీకర్ వైపు వేలు చూపిస్తూ.. బెదిరించిన చంద్రబాబు
అసెంబ్లీ: స్పీకర్పై బెదిరింపులకు పాల్పడుతున్న ప్రతిపక్షనేత చంద్రబాబు వెంటనే శాసనసభకు క్షమాపణ చెప్పాలని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శంకర్నారాయణ డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గానికి చెందిన స్పీకర్ను ఉద్దేశించి వేలు చూపించి బెదిరింపులకు పాల్పడుతున్న చంద్రబాబు సభకు క్షమాపణ చెప్పాలన్నారు. అసెంబ్లీలో మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 50 శాతం మంది వెనుకబడినవర్గాలు సభను చూస్తున్నారన్నారు. చంద్రబాబుకు బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. బలహీనవర్గాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పెద్దపీట వేస్తూ తన కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం పదవులు కేటాయించారు. ఇది చూసి చంద్రబాబు ఓర్వలేక కుమిలిపోతున్నాడు. సభకు క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబుకు తగిన రీతిలో ప్రజలే బుద్ధిచెబుతారన్నారు.