మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
నిమ్మగడ్డ రమేష్కుమార్ రబ్బర్స్టాంప్ మాత్రమే
19 Nov 2020 2:04 PM
రమేష్కుమార్ వెనుక బాబు, రామోజీ, రాధాకృష్ణ
ఎస్ఈసీ వైఖరిపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజం
కృష్ణా: నిమ్మగడ్డ రమేష్కుమార్ రాజ్యాంగ పదవిలో ఉన్నానని మర్చిపోయి చంద్రబాబుకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. నిన్న గవర్నర్కు ఇచ్చిన లేఖ టీడీపీ ఆఫీస్, రాధాకృష్ణ నుంచి వచ్చినట్లు సమాచారాలు వస్తున్నాయన్నారు. నిమ్మగడ్డ రబ్బర్ స్టాంప్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. రమేష్కుమార్ వెనుక చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ ఉన్నారని ఆరోపించారు. సీఆర్డీఏ బిల్లు రద్దుపై గవర్నర్ ఆర్డినెన్స్ చెల్లదంటూ గవర్నర్ను దూషించిన చంద్రబాబుపై చర్యలు తీసుకుంటే ప్రతిపక్ష హోదా ఉండేది కాదన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తుల పట్ల తనకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందన్నారు.