రాజమండ్రి: టిక్కెట్ల ప్రకటనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని చంద్రబాబు తీవ్రంగా అవమానపరిచారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ- జనసేన పొత్తులో టిక్కెట్ల కేటాయింపు తర్వాత డొల్లతనం బయటపడిందని పేర్కొన్నారు. పవన్ను అవమానించడమంటే సామాజిక వర్గాన్ని తీవ్రంగా అవమానించినట్లేనని అన్నారు. కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలని అత్యాశతో చంద్రబాబు గోరంగా పవన్ కళ్యాణ్ ను అవమాన పరుస్తున్నారని ఆరోపించారు. పవన్ కు రైట్లో నాదెండ్ల, లెఫ్ట్ లో కందుల ఉండేవారిని, కందుల దుర్గేష్కే టిక్కెట్ లేకపోతే ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పావలా కూడా చేయడనే అవమానం జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు 95 సీట్లు ప్రకటించుకుంటే పవన్ ఐదు సీట్లు కూడా ప్రకటించుకోలేకపోయారని అన్నారు . ఇప్పటికే టీడీపీకి రాజ్యసభలో సున్న, రేపు పార్లమెంట్లోనూ అసెంబ్లీలో కూడా సున్నాయే అని విమర్శించారు .