వైయ‌స్‌ జగన్‌ను కలిసిన జీవితా రాజశేఖర్‌

అప్పట్లో నేను అపరిపక్వతతో  ప్రవర్తించాను

ఇప్పటికే ఆయనను కలవడం ఆలస్యం అయింది

యువకుడైన వైయ‌స్‌ జగన్‌కు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి

హైదరాబాద్‌ : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం ఉదయం ప్రముఖ నటుడు జీవితా రాజశేఖర్‌ దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఈ భేటీ జరిగింది. అనంతరం రాజశేఖర్‌ మాట్లాడుతూ...‘చాలా రోజుల తర్వాత వైయ‌స్‌ జగన్‌ను కలిశాను. మా మధ్య ఉన్న కొన్ని మనస్పర్థలు ఈ రోజుతో తొలగిపోయాయి. అప్పట్లో నేను అపరిపక్వతతో  ప్రవర్తించాను. నాకు శత్రుత్వం లేదు, కానీ ఎందుకో మనస్పర్థలు ఉన్నాయి. అవి తొలగించుకోవడానికే ఆయన దగ్గరకు వచ్చాను. అప్పటి వైయ‌స్ జగన్‌ ఇప్పటి వైయ‌స్ జగన్‌ వేరు. ఇప్పటికే ఆయనను కలవడం ఆలస్యం అయింది. యువకుడైన వైయ‌స్‌ జగన్‌కు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు మా వంతు కృషి చేస్తాం.’ అని అన్నారు.

ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతు..ఎన్నికల ముందు ఇచ్చే డబ్బులు, చీరలకు ఆశపడద్దని ఓ‍టర్లకు సూచించారు. రాష్ట్ర భవిష్యత్‌ బాగుండాలంటే అది వైయ‌స్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. కష్టపడకుండా కొడుకును సీఎంను చేయాలనుకునేవారు మనకొద్దని, వైయ‌స్ జగన్ లాంటి కష్టపడేవాళ్లు మనకు కావాలని జీవిత అన్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top