సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌పై వ్యాసాలకు ఆహ్వానం

విశాఖ‌: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాహసోపేత నిర్ణయాలతో జరుగుతున్న జన రంజక పాలనపై వ్యాసాలను ఆహ్వానిస్తున్నామ‌ని విశాఖ‌ప‌ట్నం వైయ‌స్ఆర్ సీపీ ద‌ళిత విభాగం సోష‌ల్ మీడియా ప్ర‌తినిధి డాక్ట‌ర్ జీకేడీ ప్ర‌సాద్ తెలిపారు. అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం, వాలంటీర్ల వ్యవస్థ, రైతుభరోసా, ఆరోగ్యశ్రీ,  ఆరోగ్య ఆసరా, వాహనమిత్ర, వసతి దీవెన, విద్యా దీవెన... ఇలా ప్రభుత్వ పనితీరులో చోటుచేసు కున్న మార్పులను వ్యాసాల్లో విశ్లేషించాల‌ని ఆయ‌న సూచించారు. 
 
మీ వ్యాసం సరళమైన తెలుగులో, 500–800 పదాల మధ్య ఉండాలి. వాట్సప్‌లో లేదా పేజ్‌ మేకర్‌ 7.0 లేదా యూనికోడ్‌లో టైపు చేసిన  ఓపెన్‌ డాక్యుమెంట్లు మాత్రమే పంపించాలి. బహుమతులకు ఎంపికైన 20 వ్యాసాలే కాక మంచి విశ్లేషణ గల మరో 20 వ్యాసాలను కలిపి పుస్తకంగా ప్రచురిస్తాం. మొదటి (రూ.10 వేలు), రెండు (రూ.5 వేలు), మూడు (రూ.3 వేలు), నాలుగు (రూ.2 వేలు), ఐదు (రూ.1000) బహుమతులతోపాటు ప్రచురించిన ప్రతి వ్యాసానికీ రూ. 1000 ఇస్తాం. బహుమతి ప్రదానం పుస్తకావిష్కరణ రోజే ఉంటుంది. వ్యాసాలు పంపడానికి ఆఖరు తేదీ: 2022 ఏప్రిల్‌ 30. పంపాల్సిన వాట్సాప్‌ నంబర్‌: 9393111740. ఈ–మెయిల్‌: srdalitsocialmedia@gmail.com 

Back to Top