కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఘనంగా వెంకటేశ్వరస్వామి ఆలయంలో మహా సంప్రోక్షణం
09 Jun 2022 12:10 PM
గుంటూరు: తుళ్లూరు మండలం వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద్రేద్ర స్వామి, శ్రీ స్వాత్వానంద్రేద్ర స్వామి పాల్గొన్నారు.
విగ్రహ ప్రాణ ప్రతిష్ణ, మహాసంప్రోక్షణ అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, శ్రీ స్వరూపానంద్రేద్ర స్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు తదితరులు మొదటి దర్శనం చేసుకున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రూ.40 కోట్ల వ్యయంతో, 25 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణం జరిగింది.
ఈ నెల 4 నుంచి కొనసాగుతున్న మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఆలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ణ, మహాసంప్రోక్షణను టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేటి సాయంత్రం నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. తిరుమల తర్వాత టీటీడీ వెంకటపాలెంలోనే అతి పెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం గమనార్హం.