తాడేపల్లి: ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. ఏపి పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని తప్పుపట్టారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆదివారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పేర్ని నాని ఏమన్నారంటే.. - కారంపూడిలో మారణాయుధాలతో పచ్చమూకలు దాడులకు తెగబడ్డాయి.టిడిపి విధ్వంసానికి ముందే వెళ్ళిపోయిన పోలీసులు. - ఇదంతా పోలీసు అధికారుల కుట్రే. - ముఖ్యంగా కారంపూడిలో వైయస్సార్ సిపి నేతల ఇళ్ళు షాపులే లక్ష్యంగా పచ్చముఠా దాడులకు తెగబడింది. - పోలింగ్ తర్వాత కూడా టిడిపి అరాచకాలకు తెగబడింది.విధ్వంసం చేస్తున్న పచ్చమూకలను నిరోధించలేదు.చెదరగొట్టలేదు. - ఏపి పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు - వైయస్ఆర్సీపీ వారిని ఓటు వేయకుండా అడ్డుకున్నారు.కర్రలు,రాడ్డులతో తరిమి తరిమి కొట్టారు. - టిడిపి నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. - పాల్వాయి గేటులో విధ్వంసం జరిగితే పోలీసులకు ఏమాత్రం పట్టలేదు. - పల్నాడు ఎస్పి,ఇతర పోలీసు అధికారులకు పిన్నెల్లి ఫోనే చేసి చెప్పినా పట్టించుకోలేదు. - హింస జరుగుతుందని తెలిసినా, జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. - పోలింగ్ ఆగినట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్ లో ఎక్కడా లేదు. - పోలింగ్ రోజే ఎందుకు ఎఫ్ ఐ ఆర్ కట్టలేదు. - ఈవిఎం ధ్వంసం చేశారని ఈనెల 15 వతేదీన ఫిర్యాదు చేశారు. - పోలింగ్ రోజు ఈవిఎం ధ్వంసం చేస్తే ఆ రోజే ఎందుకు ఫిర్యాదు చేయలేదు. - పాల్వాయిగేటు గ్రామంలో దాడులు జరుగుతున్నా ఏసీపీ సుప్రజ ఉండి కూడా చోద్యం చూస్తూ ఉన్నారు.ఆమె వాహనం కూడా అక్కడే కనిపించింది. - టీడీపీ వారు కర్రలు, రాళ్లతీ స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకోలేదు - గొడవలను ఆపటానికి ఆమె ప్రయత్నించలేదు - కనీసం కేసు కూడా నమోదు చేయలేదు - పిన్నెల్లి ధ్వంసం చేస్తున్నట్టు చూపిస్తున్న వీడియో ఎలా బయటకు వచ్చింది? - నా ఆఫీసు నుండి వెళ్లలేదని ఎన్నికల ప్రధాన అధికారి బాధ్యత లేకుండా మాట్లాడారు.ఉన్నతాధికారి అయి ఉండి మీరు మాట్లాడే భాష అలా ఉండచ్చా.ఎన్నికల వ్యవస్థకు తండ్రిగా వ్యవహరించాల్సిన - దున్నపోతు ఈనిందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పగానే దూడని కట్టేయమని రాష్ట్ర ఎన్నికల అధికారి అంటున్నారు - అంబేద్కర్ రాజ్యాంగం మేరకు ఏర్పడిన వ్యక్తులు ఈ రకంగా వ్యవహరించారు. - వాస్తవాలు ఏంటనేది మాత్రం ఇద్దరూ పట్టించుకోవటం లేదు.ఎస్సై,సిఐలు ఎక్కడా కూడా ఎంఎల్ ఏ పిన్నెల్లి పేరు తేలేదు. - ఈసీ నియామకంతో నియమించిన అధికారులంతా టీడీపీ కోసం పనిచేశారు. - ఒక పార్టీ అధ్యక్షురాలు బరితెగించి పిటిషన్ ఇస్తే ఆమె చెప్పినట్టు అధికారులను మార్చారు - ఒక అధికారి కుటుంబంలో ఎవరైనా రెడ్డి కులస్తులను చేసుకుంటే నిర్దాక్షిణ్యంగా మార్చారు - ఆమె తప్పుడు ఫిర్యాదులు ఇచ్చినందుకు ఈసీ నోటీసులు ఇవ్వాలి - కానీ ఆ పని చేయకపోగా, ఆమె చెప్పిన అధికారులను నియమించారు - టిడిపి నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. - ఈనెల 21న ఎంఎల్ఏ పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఈసి ఆదేశించింది. - డిజిపికి అందిన సిట్ నివేదికలో పిన్నెల్లి పోరు ఎక్కడా ప్రస్తావన లేదు. - లోకేష్ ట్వీట్ చేస్తే ఈసి చర్యలకు ఆదేశిస్తుందా. - కేంద్రం ఎన్నికల సంఘం వెంటనే ఎమ్మెల్యేని అరెస్టు చేయమని ఆదేశించింది - కోర్టులకు కూడా లేని అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించాలని చూసింది - కేంద్ర ఎన్నికల సంఘం తొందరపాటు చర్యలకు దిగటం దారుణం - ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపు లాయర్ కోర్టులో గట్టిగా వాదించి బెయిల్ తెచ్చుకున్నారు - ఐనప్పటికీ ఏదో ఒక పాత కేసుల్లో ఎమ్మెల్యేని అరెస్టు చేయటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు - టివి ఛానల్స్ లో చూసిన తర్వాతే ఎన్నికల కమీషన్ అధికారులు స్పందిస్తారా. - ఈసి కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది - పోలీసుల తీరు దారుణంగా ఉంది.పోలీసుల తీరు నవ్వులపాలయింది. - కారంపూడిలో విథ్వంసం చూస్తూ ఉండిపోయారు. - సిఐ నారాయణస్వామికి గాయమైతే 10 రోజుల వరకు ఎందుకు స్టేట్ మెంట్ ఇవ్వలేదు. - సిఐకి గాయమైన పదిరోజుల తర్వాత ఎఫ్ ఐ ఆర్ కడతారా. - నాలుగో తేదీ దాకా మీ డ్రామాలు కుదురుతాయేమో? - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ తీవ్రంగా పని చేస్తోంది - ఎమ్మెల్యే పిన్నెళ్లి హత్యకు పోలీసుల ద్వారా కుట్ర పన్నారు.అయ్యా టిడిపి వాళ్ళు నన్ను చంపేందుకు మాచర్ల వస్తున్నారని ఫోన్ చేసి sp కి చెప్పుకుంటే ఉన్న సిబ్బందినే తొలగించారు. - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటిముందు ఉన్న పారామిలిటరీ బలగాలను ఎందుకు తొలగించారు? - రాష్ట్రపతి, గవర్నర్ కి మొరపెట్టుకుంటేగానీ మళ్ళీ పారామిలటరి బలగాలను పంపారు - ఈ కుట్రకు సహకరిస్తున్న ప్రతి పోలీసు అధికారి ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారు. - పల్నాడులో పోలీసు ఐజీ నేతృత్వంలోనే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి - ఎల్లోమీడియాలో వార్తలు రాయగానే పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు చర్యలకు దిగుతున్నారు. - నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద హత్యాయత్నం కేసు పెట్టారు - టీడీపీ అభ్యర్థి అరవిందబాబు ఇంట్లో బాంబులు దొరికితే కేసు కూడా పెట్టకుండా వదిలేశారు.