జూన్‌ 10వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగింపు

తాడేపల్లి: కరోనా నివారణ చర్యల దృష్ట్యా జూన్‌ 10వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కర్ఫ్యూ వేళలు యధాతథంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సడలింపు కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు యధావిధిగా కర్ఫ్యూ అమలులో ఉండనుంది. కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అనేక రకాల చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. 
 

Back to Top