ఈనెల 28న ప్యారిస్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈనెల 28న ప్యారిస్‌కు వెళ్ల‌నున్నారు. ముఖ్య‌మంత్రి  పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(ఎంబీఏ) పూర్తి చేసుకోవడంతో.. గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొనేందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఫ్రాన్స్‌కు  వెళ్తున్నారు. ఈ విషయాన్ని సీఎంవో తెలియజేసింది. 28న రాత్రి బయలుదేరనున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్.. 29న ప్యారిస్‌కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొన్న అనంత‌రం జూలై 2న తిరుగు ప్రయాణమ‌వుతారు. 

Back to Top