విశాఖ: నాయకుడంటే సేవకుడని చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. అడగకుండానే పేదలకు పెద్ద అండగా నిలుస్తున్న మనసున్న ముఖ్యమంత్రి..తన సాయం కోసం వచ్చిన వారిని ఏమాత్రం విస్మరించడం లేదు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా..ఓపిక చేసుకొని బాధితులను కలిసి వారి బాధలు వింటూ..కన్నీరు తుడుస్తున్నారు. విశాఖలో పర్యటించిన సీఎం వైయస్ జగన్ తన కాన్వాయ్ ఆపి ప్రజల సమస్యలు విన్నారు. తమ బిడ్డల అనారోగ్య సమస్య వివరించి శస్త్రచికిత్సకు సాయం చేయాల్సిందిగా శ్రీకాకుళం జిల్లా డీఆర్ వలస గ్రామానికి చెందిన కూలీలు పాండ్రంకి రామారావు, సుబ్బలక్ష్మి సీఎం వైయస్ జగన్ను కోరారు. *తమ కుమారులిద్దరూ సికిల్బెడ్ థలసేమియాతో భాదపడుతున్నారని, వారి శస్త్రచికిత్సకు ప్రభుత్వం సాయం అందించాలంటూ ముఖ్యమంత్రికి విన్నవించుకున్న రామారావు దంపతులు* *పిల్లల ఆరోగ్య పరిస్ధితి చూసి చలించిన సీఎం శ్రీ వైయస్ జగన్, వారికి అవసరమైన సాయం చేయాల్సిందిగా విశాఖ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు*. *సీఎం ను కలిసి తన సమస్య చెప్పుకున్న పెదవాల్తేరుకు చెందిన ధర్మాల త్రివేణి, కొద్దిరోజుల క్రితం తన భర్త హత్యకు గురయ్యాడని, ఇద్దరు చిన్న పిల్లలతో తన కుటుంబ పోషణ భారంగా మారిందని సీఎంకి వివరించిన త్రివేణి* *త్రివేణి కుటుంబానికి తగిన న్యాయం చేయమని విశాఖ జిల్లా కలెక్టర్ను ఆదేశించిన సీఎం*