విజయవాడ: ‘‘మీ హృదయంలో జగన్.. జగన్ హృదయంలో మీరు. ఇది ఎప్పటికీ మన అనుబంధం. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు.. బీసీలంటే బ్యాక్బోన్ క్లాసులని, బీసీలంటే వెనుకబడిన కులాలు కాదని, బీసీలంటే వెన్నెముక కులాలనీ చాటిచెబుతూ మూడున్నర సంవత్సరాల కాలంలో మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ అడుగు పడుతున్నాయి’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మీరు ఇచ్చిన అధికారాన్ని మనసుతో, మీ కోసం ఉపయోగించే విషయంలో మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ అందరికంటే మిన్నగా ఉంటాడని మరోసారి సవినయంగా తెలియజేస్తున్నాను. నా మనసంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేద వర్గాలవారే. నా ఆచరణ కూడా మీరే. నా వెనక ఉన్న ఆ నలుగురు కూడా మీరే అని సగర్వంగా తెలియజేస్తున్నానని సీఎం వైయస్ జగన్ చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ మహాసభ కార్యక్రమాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి బీసీలు భారీగా తరలివచ్చారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం వైయస్ జగన్.. అశేషమైన జనసముద్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపుగా 85 వేల మంది రకరకాల పదవుల్లో ఉన్న నా బీసీ సోదరులందరికీ, నా బీసీ అక్కచెల్లెమ్మలందరికీ మీ జగన్ నిండుమనసుతో, రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నా ఎదుట ఉన్న ఈ జనసముద్రం, మన పార్టీ తరఫున రాజకీయ సాధికారతతో గ్రామం నుంచి రాజధానుల వరకు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల జనసముద్రం. నా కేబినెట్ సభ్యుల నుంచి మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారితో పాటు వార్డు మెంబర్ల నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల వైస్ ప్రెసిడెంట్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీ వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కులాల కార్పొరేషన్లు, వాటి డైరెక్టర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్పర్సన్లు, వాటి డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వాటి డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, వాటి మెంబర్లు, ఆలయ బోర్డు చైర్మన్లు, వాటి మెంబర్లు, వీరందరితో పాటు నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ల వరకు ఎన్నికై నామినేట్ కాబడిన సభ్యుల నా బీసీ కుటుంబం ఇవాళ జనసముద్రంలా నా ముందు ఉంది. అక్షరాల 82 వేల మంది వెనుకబడిన కులాలకు సంబంధించిన నా సోదరులు, అక్కచెల్లెమ్మలు రాజకీయ సాధికారతతో పదవులు పుచ్చుకొని రకరకాల పదవుల్లో ఈరోజు ముఖాన చిరునవ్వుతో బీసీ మహాసభకు వచ్చారు. వేల సంవత్సరాలుగా మన గ్రామం మన నాగరికతకు పట్టుగొమ్మలు బీసీలు. బీసీ అంటే శ్రమ, బీసీ అంటే పరిశ్రమ, మన ఇంటి గడప తయారీ బీసీ, మన ఇంటి ఇటుకల తయారీ బీసీ, మన ఇంటి పునాది నుంచి పైకప్పు వరకు ప్రతీ అనువు బీసీ, ఇంట్లో మనం కూర్చునే కుర్చీ, పడుకునే మంచం, మన ఇంట్లో ఫర్నీచర్ తయారీ అంతా బీసీ. పెరట్లో నుయ్యి, తోడే బకెట్, దానికున్న తాడు అన్నింటి తయారీ మన బీసీ. మనం తాగే నీటి గ్లాస్ తయారీ బీసీ, మనం తినే కంచం తయారీ బీసీ. మనం ఇంట్లో వెలిగిన దీపం బీసీ, వ్యవసాయానికి ఉపయోగించే ప్రతీ పనిముటు తయారీ బీసీ, మన దుస్తులు, వస్త్రాల తయారీలు బీసీ, మన ఇళ్లలో మంగళవాయిద్యాలు బీసీ. మన బంగారు నగల తయారీ బీసీ, మన శిరోజాల సంస్కారం బీసీ, మన భారతీయ శిల్పం బీసీ, మన హరిదాసులు, బు్రరకథ, గంగిరెద్దుల ఆట మొదలు అన్ని రకాల సంస్కృతిక కళారూపాలన్నీ బీసీ. ఈరోజు బీసీల గురించి మాట్లాడాలంటే శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఒక మాట చెప్పారు . కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రపం, కొడవలి, నాగలి, ఇలా మన సహస్త్ర గ్రామీణ వృత్తుల సంగమం.. వేల సంవత్సరాలుగా మన కుటీర పరిశ్రమల సముదాం మన బీసీ. బీసీల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికతకు ఎంత చరిత్ర ఉందో.. వాటిని వేల సంవత్సరాలుగా వారి భుజస్కంధాల మీద మోస్తున్న ఘనమైన చరిత్ర బీసీలది. అటువంటి భారతీయ సమాజానికి వెన్నెముకలైన బీసీలు... ఎందుకు వెనుకబాటుకు గురయ్యారనేది ఆలోచిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒకనాడు పారిశ్రామిక విప్లవం బీసీలను వెనకడుగు వేసే కార్యక్రమం జరిగిస్తే.. మరోవైపు ఆధునిక విద్య బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అణగారిన వర్గాలకు దూరం చేయడం వల్ల బీసీలు వెనకబాటుకు గురయ్యారు. రాజకీయ అధికారంలో న్యాయబద్ధంగా వారికి రావాల్సిన వాటా రాకపోవడం వల్ల బీసీలు వెనకబాటుకు గురయ్యారు. స్వతంత్రం వచ్చిన తరువాత వెనుకబడిన కులాలుగా ఇవాల్టీకి మిగిలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి వారి పరిస్థితులు మార్చాలి. వారిగాథలు వినాలని.. నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో 139బీసీ కులాల్లో ప్రతీ ఒక్క కులాన్ని కలిసిన తరువాత వారి కష్టాలు, నష్టాలు అన్ని చూసిన తరువాత వారి ఆశలు, ఆకాంక్షలను తెలుసుకున్న తరువాత 2019 ఫిబ్రవరిలో ఏలూరులో బీసీ గర్జన నిర్వహించాం. ఆ గర్జనలో నేను చెప్పాను.. ఈ కులాలు వెనుకబడిన కులాలు కాదు.. వీటిని వెన్నెముక కులాలుగా మార్చే ప్రతీ ప్రయత్నం మీ జగన్ చేస్తాడని ఆరోజు చెప్పాను. కాబట్టే వెన్నెముక కులాల నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెలూ.. చంద్రబాబుకు చెప్పండి.. బీసీలంటే ఇస్తీ్ర పెట్టెలు, కుట్టు మెషీన్లు, షేవింగ్ కిట్లు, పనిముట్లు కాదు. 2014లో బీసీలకు ఏకంగా చంద్రబాబు 114 వాగ్దానాలు ఇచ్చి అందులో 10 శాతం కూడా అమలు చేయకుండా దగా చేసిన ఆ చంద్రబాబుకు చెప్పండి.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకున్న మా జగనన్న ప్రభుత్వానికి మేము ఇప్పుడు వెన్నెముక కులాలుగా మారామని ఆ చంద్రబాబుకు చెప్పండి. నేడు రాజ్యాధికారంలో మేమంతా భాగస్వాములమని చెప్పండి. ఈరోజున్న మాది అని గట్టిగా అర్థమయ్యేలా చెప్పండి. బీసీల వెన్నెముకలు విరిచేలా వ్యవసాయ రుణమాఫీని ఒక మోసంగా చేసిన దాఖలాలు గుర్తుచేయండి. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణమాఫీ దగాను గుర్తుచేయండి. ఫీజు రీయింబర్స్మెంట్ను ఒక ప్రాసనంగా నిర్వీర్యం చేసిన దాఖలాలు గుర్తుచేయండి. కేజీ నుంచి పీజీ వరకు బీసీ పిల్లలందరినీ ఉచితంగా చదివిస్తానని చెప్పి.. ఆ వాగ్దానాన్ని ఎండమావిగా చేసిన బాబు నైజాన్ని గుర్తుచేయండి. కళాశాలల్లో విద్యార్థులందరికీ ఐప్యాడ్లు పంపిణీ చేస్తానని చేసిన వాగ్దానాన్ని ఒక వంచనగా ఆయనకు అర్థమయ్యేలా చూపండి. బీసీ సబ్ప్లాన్ ద్వారా ప్రతీ ఏడాది రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తానని, 5 సంవత్సరాల కాలంలో అక్షరాల 50 వేల కోట్లు ఖర్చు చేస్తానని వాగ్దానం చేసి.. బీసీలను నిలువెత్తు ద్రోహం చేసిన ఆ చంద్రబాబుకు ఆ మోసాన్ని గుర్తుచేయండి. చంద్రబాబు చేసిన ఆ మోసాలను, దుర్మార్గాలను.. ఒక్కొక్కటిగా గుర్తుచేసుకుంటూ వెళ్లండి. ఎన్నికల్లో హామీలు అమలు చేయండి అని ఆరోజుల్లో మత్స్యకారులు అడిగితే.. ఇదే చంద్రబాబు అన్నమాటలు.. ఖబడ్దార్, మీ అంతు చూస్తానని అన్నాడు. నాయీ బ్రాహ్మణులు హామీల గురించి అడిగితే మీ తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన మాటలు ఒక్కసారి అందరూ గుర్తుచేసుకోండి. చంద్రబాబుకు గట్టిగా చెప్పండి.. అయ్యా బాబూ మాకు తోకలు లేవుగానీ, మీ తోకలను, మీకు మొలిచిన కొమ్ములను, మీకు కొమ్ముకాసేవారిని అందరినీ కత్తిరించే సామాజిక చైతన్యం మాకుందని గట్టిగా చంద్రబాబుకు చెప్పండి. ఏలూరు బీసీ డిక్లరేషన్ను ఒక్కసారి గుర్తుచేసుకోండి. 2019 ఫిబ్రవరిలో ఏలూరు డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానాలను ఎలా నెరవేర్చామో ఒక్కసారి గమనించండి. ఆ డిక్లరేషన్లో బీసీ కులాలన్నింటికీ ప్రభుత్వ కార్పొరేషన్లు అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి బీసీ గర్జనలో డిక్లరేషన్ చేశాం. ఇచ్చిన మాట ప్రకారం చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 139 కులాల పేర్లతో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశానని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను. – బీసీ కమిషన్ను శాశ్వత ప్రాతిపదిక మీద నియమించేందుకు చట్టం చేస్తామని ఆరోజు డిక్లరేషన్లో చెప్పాం.. చెప్పిన మాట ప్రకారం చట్టం చేశాం. శాశ్వత బీసీ కమిషన్ను దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే నియమించాం. – నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పాం. ఆ మాటను తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేశాం. ఆలయ బోర్డు మొదలు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వరకు ఇతర నామినేటెడ్ పదవులు అన్నింటిలోనూ ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కనిపిస్తున్నారు. ఇవాళ 85 వేల మంది ప్రజాప్రతినిధులు బీసీ మహాసభకు తరలివచ్చి చిరునవ్వుతో కూర్చోవడమే మన ప్రభుత్వం చేసిన మంచికి సాక్ష్యం. – నామినేషన్ పనుల్లో 50 శాతం కచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తామని, నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు హామీ ఇచ్చాం. ఇది కూడా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేసి మరీ అమలు చేస్తున్నాం. ఈరోజు గ్రామాల్లో నామినేషన్ పనుల్లో నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 50 శాతం చేస్తున్నారు. – షాపులు పెట్టుకొని సంప్రదాయ వృత్తులు చేసుకుంటున్న నా బీసీలకు, చిరు వ్యాపారులతో జీవనం సాగిస్తున్న బీసీలందరికీ, ఇతర పేద కులాలకు మేలు చేసేలా పథకాలన్నీ అమలు చేస్తామని బీసీ డిక్లరేషన్లో ఆరోజు చెప్పాం. మాటకు కట్టుబడి జగనన్న చేదోడు, జగనన్న తోడు పథకాలు తీసుకొచ్చామని సగర్వంగా తెలియజేస్తున్నాను. – జగనన్న చేదోడు ద్వారా నా రజకులు, నా నాయీ బ్రాహ్మణులు, నా టైలర్ సోదరులు, వారి కుటుంబాలందరికీ అందించిన ఆర్థిక సాయం ఇప్పటి వరకు రూ.584 కోట్లు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. – జగనన్న తోడు ద్వారా తోపుడు బండ్లు, ఫుట్పాత్ మీద దుకాణాలు నడుపుకుంటున్న ఆ వర్గాలకు సున్నావడ్డీ ద్వారా అందించిన ఆర్థిక సాయం ఇప్పటి వరకు రూ.2059 కోట్లు. దాదాపు 15 లక్షల కుటుంబాలు ఈ పథకాల ద్వారా సంతోషంగా బతకగలుగుతున్నారు. – 45 సంవత్సరాలు నిండిన నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల కోసం చేయూత పథకాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేశాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ప్రతి ఇంటా ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే ఆరాటంతో అక్షరాల 26.40 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా వారి ఆర్థిక సాధికారతను బలపరుస్తూ ఇప్పటి వరకు రూ.14,110 కోట్లు అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. – తిరుమల ఆలయంలో సన్నిధి గొల్లలకు తలుపులు తెరిచే సంప్రదాయ హక్కు ఇస్తామని డిక్టరేషన్లో మాట చెప్పాం.. ఆ మాట ప్రకారం అధికారంలోకి రాగానే సన్నిధి గొల్లలకు తలుపులు తెరిచే సంప్రదాయ హక్కు కల్పిస్తూ జీవో జారీ చేశాం. – ఫీజురీయింబర్స్మెంట్కు అర్థం కేవలం అరకొర ఫీజులు ఇవ్వడం కాదు, ఇచ్చే ఆ సొమ్ము కూడా సంవత్సరాల తరబడి బకాయిలు పెట్టడం కాదు.. ఆ పథకాన్ని నీరుగార్చే దిశగా అడుగులు వేసిన గత పరిస్థితిని మారుస్తామని చెప్పి డిక్లరేషన్లో మాటిచ్చాం. అటువంటి దుర్మార్గానికి చరమగీతం పాడుతూ ఏ డిగ్రీ అయినా ఇంజినీరింగ్ నుంచి డాక్టర్ వరకు ఎంత ఫీజు అయినా వందశాతం ఆ ఫీజును మనందరి ప్రభుత్వం భరించే విధానాన్ని మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేశాం. మన తలరాతలు మారాలంటే మన పిల్లలు గొప్పగా చదవాలి.. ఆ చదువుల కొరకు ఏ తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదు. అప్పుడే మన బతుకులు మారుతాయని అడుగులు ముందుకువేశాం. – మనం అధికారంలోకి రాకముందు సంవత్సరాల్లో చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా బీసీల మీద ప్రేమతో వాటిని కూడా మనందరి ప్రభుత్వం చిరునవ్వుతో చెల్లించడం జరిగిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. – జగనన్న విద్యా దీవెన – పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ పథకానికి మూడున్నరేళ్ల కాలంలోనే అక్షరాల రూ.9,052 కోట్లు ఖర్చు చేశాం. – పిల్లలు, వారి తల్లిదండ్రులు హాస్టల్, మెస్ ఖర్చుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదని అక్షరాల 20 వేల రూపాయలు పిల్లల చేతుల్లో పెట్టేలా.. తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా చేసేలా జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం.. అక్షరాల ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో జగనన్న వసతి దీవెన పథకానికి రూ.3349 కోట్లు ఖర్చు చేశాం. – మత్స్యకారులకు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకుంటామని ఆరోజు మాట చెప్పాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులకు ఇచ్చిన మాట మేరకు చేపల వేట నిషేధ సమయంలో బాబు హయాంలో కొందరికి మాత్రమే ఇచ్చే పరిస్థితి అది కూడా ముష్టివేసినట్టుగా రూ.4 వేలు ఇచ్చేవారు. దానిని మార్చి రూ.10 వేలకు పెంచుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ జగనన్న ప్రభుత్వం అడుగులు వేసింది. వైయస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ఈ మూడున్నరేళ్ల కాలంలో అక్షరాల రూ. 418 కోట్లు అందించాం. – నేతన్నల విషయానికి వస్తే.. సొంతమగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రతీ ఏటా రూ.24 వేలఆర్థిక సాయం అందిస్తామని బీసీ డిక్లరేషన్లో ఆరోజున ప్రకటించాం. ఇచ్చిన మాట ప్రకారం వైయస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే అడుగులు పడ్డాయి. ఈ మూడున్నరేళ్లలో రూ.776 కోట్లను నేతన్నల చేతుల్లో పెట్టాం. – చంద్రబాబు ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.10 వేల కోట్లు బీసీ సబ్ప్లాన్కు కేటాయిస్తామని మాట చెప్పి.. ఐదు సంవత్సరాల కాలంలో కనీసం రూ.20 వేల కోట్లు కూడా ఖర్చు చేయకుండా బీసీలకు అన్యాయం చేస్తే.. ఏలూరులో బీసీ డిక్లరేషన్లో చెప్పాం.. బీసీ సబ్ప్లాన్కు ప్రతీ ఏటా రూ.15 వేల కోట్లు.. ఐదు సంవత్సరాల్లో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని మీ బిడ్డ ఆరోజున మాట చెప్పాడు. చెప్పిన మాట కంటే మిన్నగా ఈ మూడున్నర సంవత్సరాల కాలంలోనే బీసీలకు మాత్రమే డీబీటీ, నాన్ డీబీటీ కింద ఖర్చు చేసిన మొత్తం ఏకంగా రూ.1.63 లక్షల కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను. – రూ.1.63 లక్షల కోట్లలో కేవలం డీబీటీ మాత్రమే తీసుకుంటే.. (ఇళ్ల పట్టాలు, ఇళ్లు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, జగన్న తోడు ఇవన్నీ పక్కనబెట్టినా) అక్షరాల రూ.86 వేల కోట్లు ఈ మూడున్నరేళ్ల కాలంలో ఇవ్వడం జరిగింది. – వెన్నెముక కులాలుగా మార్చడం అంటే ఇదీ అని సగర్వంగా తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన అధికారాన్ని మనసుతో, మీ కోసం ఉపయోగించే విషయంలో మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ అందరికంటే మిన్నగా ఉంటాడని మరోసారి సవినయంగా తెలియజేస్తున్నాను. నా మనసంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేద వర్గాలవారే. నా ఆచరణ కూడా మీరే. నా వెనక ఉన్న ఆ నలుగురు కూడా మీరే అని సగర్వంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అవుతుంది. మీ బిడ్డ జగన్ వయస్సు 49 సంవత్సరాలు. మరి చంద్రబాబు 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న మనిషి.. ఇంతకు ముందు పేద వర్గాలకు మంచి చేసి ఉంటే మన ప్రభుత్వం మీద 2024లో ఒంటరిపోరాటం చేస్తానని మాత్రం చెప్పడం లేదు. ఎందుకో తెలుసా.. ఈ మనిషి చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి.. 2024లో ఒంటరిగానే జగన్ను ఎదుర్కుంటానని ఎందుకు చెప్పలేకపోతున్నాడు.. ఎందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి మీద ఆధారపడుతున్నాడంటే.. చంద్రబాబు చేసిన మంచి ఏంటో చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు కాబట్టే ఈరోజు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు, మోసాలు చేసే కార్యక్రమాలకు తెగబడుతున్నారు. నవరత్నాల్లో మొదటిది ఆర్థిక సాధికారత, డీబీటీ, నాన్ డీబీటీ పరంగా అడుగులు వేశాం. రెండోది రాజకీయ సాధికారత, దీనికి అద్దం పట్టే విధంగా పదవులు, నియామకాలు. ఈ రెండింటి ద్వారా సామాజిక సాధికారత దిశగా పయనించాం. మహిళా సాధికారత నాలుగో విషయం. రేపటి తరాల భవిష్యత్ నిర్ణయించే విద్యా సాధికారత ఐదోది. ► గత మూడున్నరేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.3,19,228 కోట్లు లబ్ధి చేకూర్చాం. ఇందులో మొత్తంగా నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు, అక్కచెల్లెమ్మలకు అందించింది అక్షరాలా రూ.2,50,358 కోట్లు. అంటే దాదాపు 80 శాతం. దోచుకుతిన్న చంద్రబాబు, ఎల్లో బ్రదర్స్, దత్తపుత్రుడు ► 2018–19లో చంద్రబాబు హయాంలో బడ్జెట్ ఎంత ఉందో.. మన అందరి ప్రభుత్వానిది కూడా దాదాపు అంతే బడ్జెట్. అప్పుడు అప్పుల పెరుగుదల రేట్ 19 శాతం ఉంటే ఇప్పుడు 15 శాతం మాత్రమే. అదే రాష్ట్రం అదే బడ్జెట్, మీ బిడ్డ ప్రభుత్వంలోనే తక్కువ. మరి అప్పుడు ఈ పథకాలు ఎందుకు లేవని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కారణం అప్పట్లో ఆ బడ్జెట్ను చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు.. మాత్రమే దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) అనే పద్దతిలో తినేసే పరిస్థితి. ► ఈ రోజు మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు ఆ డబ్బు నేరుగా మీ ఇంటికి వస్తుంది. ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. ప్రతి ఇంట్లో చిరునవ్వులు ఇవ్వగలిగాం. ► మన దేశంలో బీసీలకు మేలు చేయడానికి 1980లో వచ్చిన మండల్ కమిషన్ నాటి నుంచి అనేక కమిషన్లు, కమిటీలు ఏర్పాటైనా ఎక్కడా విద్య, ఉద్యోగాల విషయంలో అనేక అవరోధాలు ఎదురయ్యాయి. అలాంటిది మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం రాజకీయ సాధికారత విషయంలో చేతలతో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. రాజకీయ సాధికారత అంటే ఇదీ.. ► మంత్రి మండలిలో మొదటి విడతలో 56 శాతం నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానం కల్పిస్తే.. రెండో విడతలో దానిని ఏకంగా 70 శాతానికి తీసుకెళ్లాం. ఐదుగురుకి ఉప ముఖ్యమంత్రులు పదవులు ఇస్తే అందులో నలుగురు ఈ వర్గాల వారే. 25 మంది మంత్రులలో 11 మంది ఈ రోజు బీసీలే ఉన్నారు. ► 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపిన పాపాన పోలేదు. మీ బిడ్డ రాజ్యసభకు 8 మందిని పంపితే అందులో నలుగురు మన బీసీలే. ► శాసనమండలిలో మన పార్టీ తరఫున 32 మంది ఎమ్మెల్సీలు ఉంటే అందులో 18 మంది నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. శాసనసభ స్పీకర్గా ఇదే వేదికపై ఉన్న తమ్మినేని సీతారామ్ బీసీ. శాసనమండలి చైర్మన్గా ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్, డిప్యూటీ చైర్పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన నా అక్కను ఆ స్థానంలో కూర్చొబెట్టాం. స్థానిక సంస్థలలో సింహభాగం వాటా ► స్థానిక సంస్థలకు మొత్తంగా 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 637 మండలాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరేసింది. అందులో ఒక్క బీసీలకు మాత్రమే 237 ఎంపీపీ పదవులలో కూర్చోబెట్టాం. అంటే 38 శాతం. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 67% ఇవ్వగలిగాం. ► 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో బీసీలకు 6 పదవులు అంటే 46 శాతం ఇచ్చాం. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే 9 పదవులు అంటే 69 శాతం చైర్మన్ పదవులు. ► 14 నగర కార్పొరేషన్ మేయర్ పదవులలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తే.. బీసీలకు ఏకంగా 9 పదవులు అంటే 64 శాతం ఇచ్చాం. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కు గాను 12 పోస్టులు అంటే 86 శాతం మేయర్ పదవులు కట్టబెట్టాం. ► 87 మున్సిపాల్టీలకు గాను 84 చోట్ల వైఎస్సార్సీపీ జెండా ఎగరవేసింది. ఇందులో 44 మున్సిపల్ ఛైర్మన్లుగా బీసీలు.. 53% కనిపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 58 స్థానాల్లో 69 శాతంగా వీరే రాజ్యాన్ని పాలిస్తున్నారు. జయహో బీసీ అంటే ఇదీ.. ► 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చాం. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 117 అంటే 60 శాతం ఇచ్చాం. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 53 పదవులు (39 శాతం) బీసీలకే ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 79 అంటే 58 శాతం పదవులు ఇచ్చాం. వీటిలో 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే అందులో 201 బీసీలకు 41 శాతం ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 280 అంటే 58 శాతం ఇచ్చాం. ► బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. వీటిలో మరో 684 డైరెక్టర్ పదవులన్నీ వీరికే ఇచ్చాం. ఆలయ బోర్డులు, ఆలయ ఛైర్మన్ పదవులు తీసుకున్నా అందులో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ఇచ్చాం. ► దాదాపుగా 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503 సగభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే ఉన్నారు. ఇందులో బీసీలు ఒక్కరే 2,650 పదవుల్లో 38 శాతం ఉన్నారు. ఇది జయహో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటే. ఉద్యోగాలలోనూ అధిక శాతం వాటా ► గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చాం. ఇందులో 84% నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తమ్ముళ్లు, చెల్లెళ్లు పనిచేస్తున్నారు. అప్పట్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేసి, మోసం చేశారు. ► మన ప్రభుత్వంలో 54 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో రెగ్యులరైజ్ అయ్యారు. ఆరోగ్య రంగంలో 46 వేల పోస్టులు.. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ (ఆప్కాస్ ) ద్వారా మరో లక్ష మందికి ఎటువంటి దళారులు లేకుండా, లంచాలిచ్చే పరిస్థితి లేకుండా, కమీషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మెరుగైన జీతాలు కల్పిస్తున్నాం. కాంట్రాక్ట్లో పని చేస్తున్న వారికి తొలిసారిగా మినిమమ్ టైం స్కేల్ తీసుకొచ్చాం. 2.60 లక్షల మంది తమ్ముళ్లు, చెల్లెళ్లు వలంటీర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో 83% నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. మొత్తంగా 6 లక్షల పై చిలుకు మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తున్నారు. వారు ఏ సామాజిక న్యాయానికి ప్రతినిధులో? ► ప్రభుత్వ బడులన్నింటినీ నాడు–నేడుతో రూపురేఖలు మార్చుతున్నాం. బైలింగ్యువల్ బుక్స్, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం. ఇన్ని చేస్తుంటే పెత్తందారీ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మొత్తంగా ఎల్లోబ్రదర్స్ వారితో పాటు దత్తపుత్రుడికి బాధ కలుగుతోంది. వీరంతా ఏ సామాజిక న్యాయానికి ప్రతినిధులో అందరూ ఆలోచించాలి. ► పేదలకు ఇళ్ల స్ధలాలిస్తామంటే కోర్టులో కేసులు వేస్తారు. అమరావతిలో నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇళ్ల పట్టాలిస్తామంటే.. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేయిస్తారు. చివరకి ప్రాంతాల వారీగా వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా 3 రాజధానులు చేస్తామని అంటే వీళ్లంతా అరిచి గీపెడుతున్నారు. వారు ఇలాగే పేదరికంలో మిగిలిపోవాలన్నది వారి ఆలోచన. వీళ్లను శాశ్వతంగా పేదరికంలోంచి ఎలా బయటకు తేవాలన్నది మీ బిడ్డ ప్రభుత్వం తాపత్రయం. మానవతావాదానికి ప్రతీక వైఎస్సార్సీపీ. మహిళా సాధికారత దిశగా.. ► ఏకంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. అందులో ఇప్పటికే 21.20 లక్షల ఇళ్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఆ 30 లక్షల ఇళ్ల పట్టాలలో నా బీసీ అక్కచెల్లెమ్మలకు 16,70,286 ఇళ్లు ఇవ్వగలిగాం. అంటే 56 శాతం బీసీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చి మేలు చేశాం. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అక్కచెల్లెమ్మలను కలుపుకుంటే.. 88 శాతం వీళ్లకే ఇళ్ల పట్టాలిచ్చాం. వీటిలో ఇళ్లు కట్టడం కూడా పూర్తయితే ప్రతి అక్కా, చెల్లెమ్మ చేతిలో రూ.5 లక్షల నుంచి 10 లక్షలు వారి చేతిలో పెట్టినట్లవుతుంది. రాష్ట్రం మొత్తంగా రూ.2..3 లక్షల కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టినట్లవుతుంది. ► 79 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.9,294 కోట్లు.. అంటే 73%. రేపు జనవరిలో మరో రూ.6,379 కోట్లు వారి చేతుల్లో పెట్టబోతున్నాం. ► దాదాపు కోటి రెండు లక్షల మంది ఉన్న నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రూపంలో రూ.3,615 కోట్లు ఇచ్చాం. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రూ.2,803 కోట్లు ఇచ్చాం. అంటే 78 శాతం నిరుపేద అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. ► 45 నుంచి 60 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న దాదాపు 26.40 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు, చెల్లెమ్మలకు వైయస్సార్ చేయూత పథకం ద్వారా రూ.14,110 కోట్లు ఇచ్చాం. ► జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 44.50 లక్షల మంది చెల్లెమ్మలకు రూ.19,617 కోట్లు ఇచ్చాం. ఇందులో రూ.15,378 కోట్లు అంటే 78 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ చెల్లెమ్మల చేతిలో పెట్టాం. మరో 25 లక్షల మంది పిల్లలకు, తల్లులకు మేలు చేస్తూ.. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన డబ్బులన్నీ ఆ తల్లుల ఖాతాల్లో జమ చేశాం. చెప్పినట్లుగా బీసీ డిక్లరేషన్ అమలు ► చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 139 కులాల పేర్లతో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. శాశ్వత బీసీ కమిషన్ను దేశంలో తొలిసారిగా నియమించాం. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. ► ఆలయ బోర్డులు మొదలు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల వరకు ఇతర నామినేటెడ్ పదవులన్నింటిలోనూ ఈ రోజు ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కనిపిస్తున్నారు. ఇవాళ ఇక్కడ కనిపిస్తున్న 85 వేల మందే ఇందుకు సాక్ష్యం. నామినేషన్ పనుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి, అమలు చేస్తున్నాం. ► జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా షాపులు పెట్టుకుని సంప్రదాయ వృత్తులు చేసుకుంటున్న బీసీలకు, చిరు వ్యాపారులకు అండగా నిలిచాం. ఈ మూడున్నరేళ్లలో చేదోడు ద్వారా రూ.584 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. జగనన్న తోడు ద్వారా రూ.2,059 కోట్లు సున్నా వడ్డీ రుణాలు అందించాం. తద్వారా దాదాపు 15 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. ► 45 ఏళ్లు నిండిన 26.40 లక్షల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల కోసం చేయూత పథకం ద్వారా మేలు చేస్తున్నాం. ఈ మూడున్నరేళ్లలో రూ.14,110 కోట్లు ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక సాధికారతను బలోపేతం చేశాం. సన్నిధిగొల్లలకు తిరుమల ఆలయం తలుపులు తెరిచే సంప్రదాయ హక్కును పునరుద్ధరిస్తూ జీవో జారీ చేశాం. ► ఎంత పెద్ద చదువైనా సరే వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలూ చెల్లించాం. ఈ మూడున్నరేళ్లలో రూ.9,052 కోట్లు ఖర్చు చేశాం. హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన కింద రూ.20 వేల వరకు ఇస్తున్నాం. ఈ మూడున్నరేళ్లలో ఈ పథకానికి రూ.3,349 కోట్లు వెచ్చించాం. ► చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచాం. మత్స్యకార భరోసా పథకం ద్వారా రూ.418 కోట్లు అందించాం. సొంత మగ్గమున్న నేత కార్మికులకు ఏటా రూ.20 వేలు చొప్పున ఈ మూడున్నరేళ్లలో రూ.776 కోట్లు వారి చేతుల్లో పెట్టాం.