కేటీఆర్‌కు సీఎం వైయస్‌ జగన్‌ ఫోన్‌.. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా

తాడేపల్లి: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌కు సీఎం వైయస్‌ జగన్‌ ఫోన్‌ చేసి పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

గజ్వేల్‌ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో శుక్రవారం తెల్లవారుజామున కేసీఆర్‌ ప్రమాదానికి గురయ్యారు. బాత్రూమ్‌లో కాలుజారి పడిపోయారు. ఎడమ తుంటిలో ఫ్యాక్చర్‌ అయినట్లు వైద్యులు తెలిపారు. యశోద ఆస్ప‌త్రిలో కేసీఆర్‌కు సర్జరీ నిర్వహించారు.

Back to Top