తాడేపల్లి: కరోనా వ్యాపిస్తుందన్న సూచనలు నేపధ్యంలో అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ, కోవిడ్ తాజా పరిస్థితిపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. గ్రామ స్ధాయిలోనే పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్నవారికి కోవిడ్ సోకితే వారిని వెంటనే హాస్పిటల్కి తరలించేలా చర్యలుండాలన్నారు. కోవిడ్ తాజా పరిస్థితి, నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని తెలిపిన అధికారులు. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు. విలేజ్ క్లినిక్స్ స్ధాయిలోనే ర్యాపిడ్ టెస్టులు చేసే వ్యవస్థ ఉందని, అక్కడ ఏమైనా తేలితే వెంటనే ఆర్టీపీసీఆర్కు పంపించే ఏర్పాటు చేశామన్న అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేయించామని కేవలం 25 మంది మాత్రమే కోవిడ్తో ఆస్పత్రిలో చేరారని వెల్లడించిన అధికారులు. ఆక్సిజన్ లైన్లు, పీఎస్ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ సిలెండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వీటన్నింటినీ కూడా చెక్ చేసి సిద్ధంచేసుకుంటున్నామన్న అధికారులు. అంతర్జాతీయ విమాన ప్రయాణికులనుంచి ర్యాపిడ్ శాంపిల్స్ తీసుకునేందుకు విమానాశ్రయాల్లో అన్నిరకాలుగా సిద్ధంచేశామన్న అధికారులు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే... ముందు జాగ్రత చర్యల్లో భాగంగా అన్నిరకాలుగా సిద్ధం కావాలన్న సీఎం. ఎప్పటికప్పుడు పరిస్థితిని చూసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. ఫ్యామిలీ డాక్టర్, విలేజీ క్లినిక్స్ వ్యవస్ధ కోవిడ్ విస్తృతిని అడ్డుకోవడానికి, మంచి వైద్యం అందించేలా చేయడానికి ఉపయోగపడుతుందన్న సీఎం. గ్రామాల్లో సర్వే చేసి, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి, వారికి వెంటనే మందులు ఇచ్చేలా చూడాలన్న సీఎం. ప్రతి విలేజ్ క్లినిక్కూ టెస్టింగ్ కిట్స్, మందులు పంపించాలని సీఎం ఆదేశం. ప్రస్తుతం ఉన్న వేరియంట్కు తగినట్టుగా మందులు తెప్పించుకోవాలన్న సీఎం. ల్యాబులను అన్నింటినీ కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసుకోవాలన్న సీఎం. జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపైనా సీఎం సమీక్ష. మొదటి ప్రాధాన్యతలో నిర్దేశించుకున్న విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల్లో షెడ్యూలు ప్రకారం పనులు జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు. మిగిలిన కాలేజీల్లో కూడా పనులను ముందుకు తీసుకెళ్తున్నామన్న అధికారులు. పూర్తయ్యే దశలో పలాస కిడ్నీ స్పెషాల్టీ హాస్పిటల్, కర్నూలులో కేన్సర్ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ కడపలో జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ, కేన్సర్ విభాగంతో సహా మూడు బ్లాకులు. కొన్నిరోజుల్లో ఇవి పూర్తిగా సిద్ధమవుతాయని తెలిపిన అధికారులు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శాంబశివారెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ బి చంద్రశేఖర్రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, డ్రగ్స్ డీజీ రవి శంకర్, ఏపీవీవీపీ కమిషనర్ వి వినోద్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు.