అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
 

సచివాలయం: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే స్థలం మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించి మరీ ఇస్తామని వివరించారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయం డిస్‌ప్టేలో పెట్టాలని అధికారులకు సూచించారు. ప్లాట్ల నిర్వహణ వల్ల ప్రజలకు చాలా సమస్యలు వస్తాయని, ఇండిపెండెంట్‌గా ఇల్లు నిర్మించి ఇస్తే ఎవరికి వారే తమ ఇంటిని భద్రంగా చూసుకుంటారన్నారు. కాల్వ గట్లు, నదీ తీర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఇళ్లు కట్టించి వారిని తరలించాలని సూచించారు. ఇలాంటి వారి కోసం సుమారు 5 లక్షల ఇళ్లు అవసరమని ప్రభుత్వం అంచన.

Read Also: తీపి కబురు

 

తాజా వీడియోలు

Back to Top