పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన సీఎం వైయస్‌ జగన్‌  

 ఏరియల్‌ సర్వే ద్వారా పనుల పరిశీలన
 

పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్ట్‌ పనులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ పనులను ఏరియల్‌ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను పరిశీలించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. అంతకు ముందు పోలవరం ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు హెలిప్యాడ్‌ వద్ద మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పేర్ని నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, తల్లారి వెంకట్రావు, దేవులపల్లి ధనలక్ష్మి, జీయస్ నాయుడు, ముదునూరి ప్రసాదరాజు, పుప్పాల వాసుబాబు, ఎంపీలు మార్గని భరత్, కోటగిరి శ్రీధర్‌, కలెక్టర్‌ ముత్యాల రాజు స్వాగతం పలికారు.  

Back to Top