మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యం
పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించిన సీఎం వైయస్ జగన్
28 Feb 2020 11:29 AM
ఏరియల్ సర్వే ద్వారా పనుల పరిశీలన
పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్ట్ పనులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్ పనులను ఏరియల్ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వేను పరిశీలించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. అంతకు ముందు పోలవరం ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న సీఎం వైయస్ జగన్కు హెలిప్యాడ్ వద్ద మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్ని నాని, అనిల్కుమార్ యాదవ్, ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, తల్లారి వెంకట్రావు, దేవులపల్లి ధనలక్ష్మి, జీయస్ నాయుడు, ముదునూరి ప్రసాదరాజు, పుప్పాల వాసుబాబు, ఎంపీలు మార్గని భరత్, కోటగిరి శ్రీధర్, కలెక్టర్ ముత్యాల రాజు స్వాగతం పలికారు.