మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో చర్చకు తీసుకురండి
14 Sep 2020 3:45 PM
వైయస్ఆర్ సీపీ ఎంపీలతో సీఎం వైయస్ జగన్ వర్చువల్ మీటింగ్
పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం
తాడేపల్లి: గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పార్లమెంట్లో చర్చకు తీసుకురావాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపీలకు సూచించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా, ప్రాజెక్ట్ల సాధనపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో పాట పోలవరం ప్రాజెక్ట్కు నిధుల సాధన అజెండాగా సమావేశంలో ఎంపీలకు సూచించారు. అన్ని ఫార్మాట్ల అవకాశాలను పార్లమెంట్లో వినియోగించుకునేలా ఎంపీలకు సీఎం వైయస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. కాగా, ఇప్పటికే బీఏసీ సమావేశంలో ఏపీకి సంబంధించిన కరోనా నియంత్రణ చర్యలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని వైయస్ఆర్సీపీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి స్పీకర్ను కోరిన సంగతి తెలిసిందే.