ఢిల్లీ చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ఢిల్లీ: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక  విమానంలో బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కొద్దిసేప‌టి క్రిత‌మే ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు, పార్టీ నేత‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై ప్ర‌ధానితో చ‌ర్చించ‌నున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ భేటీ కానున్నారు.

Back to Top