వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నిర్మలా సీతారామన్ను కలిసిన మంత్రి బుగ్గన
03 Mar 2020 6:37 PM
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ను ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరానన్నారు. ప్రత్యేకహోదా, ఆర్థికలోటు, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు...రామాయపట్నం పోర్టుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాన్నారు. పోలవరం పనుల వేగం పెంచేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని సడలించాలని కోరానన్నారు. అలాగే మౌలిక వసతులకు గ్రాంట్లు ఇవ్వాలని, ఉత్తరాంధ్రలో పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు చెప్పారు. ఏపీలో వృద్ధి రేటు 8శాతంగా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు.