కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఏపీపై కేసీఆర్ చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నారు
09 Jul 2021 12:07 PM
వైఎస్ లేకుంటే ప్రాణహిత-చేవెళ్ల ఎక్కడిది?
శాసనమండలి ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్రెడ్డి
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఏపీ శాసనమండలి ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుదుత్పత్తి కోసం రోజుకు 14, 15 వేల క్యూసెక్కుల శ్రీశైలం జలాశయ నీటిని వినియోగిస్తున్నారని ఆరోపించారు.
శ్రీశైలం జలాశయంలో 854 అడుగులకు పైగా నీరు ఉంటేనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందుతుందన్నారు. విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా తిరిగి తమపైనే కృష్ణా ట్రైబ్యునల్కు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తక్కువ రోజుల్లోనే కృష్ణా జిలాలను తరలించాల్సి ఉండడంతోనే పోతిరెడ్డిపాడును విస్తరించినట్టు ప్రభాకర్రెడ్డి వివరించారు. నేడు తెలంగాణ నేతలు వైయస్ను అదే పనిగా విమర్శిస్తున్నారని, ఆయనే లేకుంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎక్కడిదని గంగుల ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు.