ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం : వైయ‌స్‌ జగన్‌

  అమరావతి : ఎన్నికల ఫలితాల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టింస్తోంది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహ‌న్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఫలితాల్లో ఫ్యాన్‌ హవా కొనసాగుతోంది. కాగా, ఎన్నికల ఫలితాలపై వైయ‌స్‌ జగన్‌ ఫేస్‌బుక్‌ పేజీలో స్పందించారు.

'వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ని ఆశీర్వదించిన అశేష ప్రజానికానికి.. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటి చెప్పిన యావత్‌ రాష్ట్ర ప్రజలకు ... హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను' అని ఫేస్‌బుక్‌పేజీలో పోస్ట్‌ చేశారు.

 
 

 

Back to Top