త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలు

ముస్లిం సోదరులకు సీఎం వైయ‌స్ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

తాడేప‌ల్లి:  త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.  ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని’’ సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ అభిలషించారు.
 

Back to Top