అబుల్‌ కలాం ఆజాద్‌కు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

 

విజయవాడ: నేడు జాతీయ విద్య, మైనార్టీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ విద్య, మైనార్టీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలాం విద్య పురస్కారాలను సీఎం వైయస్‌ జగన్‌ అందజేయనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత రెహ్మాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఇంగ్లిష్‌ మీడియం ప్రతి విద్యార్థి హక్కు

తాజా వీడియోలు

Back to Top