ఇంగ్లిష్‌ మీడియం ప్రతి విద్యార్థి హక్కు

ఎంపీ విజయసాయిరెడ్డి
 

అమరావతి: ఇంగ్లిష్‌ మీడియం చదువుకోవడం ప్రతి విద్యార్థి హక్కు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంలో మాత్రమే బోధించాలనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. బలహీనవర్గాల వారిని ఇంకా ఎంతకాలం మీ పిల్లలు, మనవళ్లు చదువుకునే ఆంగ్ల మాధ్యమానికి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తారు బాబూ?’ అని ప్రశ్నించారు.

 

Read Also:  జనవరిలో అటవీశాఖ పోస్టుల భర్తీ 

Back to Top