మాజీ డీజీపీ హెచ్ జే దొర మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం

తాడేప‌ల్లి: మాజీ డీజీపీ హెచ్‌ జే దొర మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పోలీసు విభాగంలో విశిష్ట సేవలు అందించి ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారి గా హెచ్ జే దొర గారి సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చక్కటి కృషి చేశారని పేర్కొన్నారు. 

పోలీసు వ్యవస్థకు ఆయన అందించిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. హెచ్‌ జే దొర గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం వారికి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Back to Top