పల్నాడు: చంద్రబాబు నాయుడుకు ఏసీ కావాలని టీడీపీవారు నానా యాగీ మొదలుపెట్టారు. ఏసీ కావాలంటున్నవారు భారతదేశంలో జైళ్ళకు సంబంధించిన నిబంధనలు తెలిసి మాట్లాడాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సూచించారు. టీడీపీకి లాయర్లు కావాల్సినంతమంది ఉన్నారు. వారందిరికీ జైలు మాన్యువల్ తెలుసు. జైలు మాన్యువల్ ప్రకారం రిమాండ్ ఖైదీలకు కానివ్వండీ, ఖైదీలకు కానివ్వండీ- ఏసీ ఉండదని తెలుసు అన్నారు. ఒకవేళ ఏసీ కావాలంటే, చల్లదనం వల్ల చంద్రబాబుకు డెర్మటాలజీ సమస్యలు తగ్గుతాయనుకుంటే.. ఆ విషయాన్ని చంద్రబాబు లాయర్లు లేదా చంద్రబాబు కుటుంబం మీడియాలో మాట్లాడి, దాన్ని రాజకీయం చేసుకుంటుందా..? లేక, కోర్టు మెట్లు ఎక్కి కోర్టును అడుగుతుందా..? అని ప్రశ్నించారు. శనివారం మంత్రి అంబటి రాంబాబు పత్రికా ప్రకటన విడుదల చేశారు. -35 రోజులుగా ఏనాడూ చంద్రబాబు లాయర్లు, తమ క్లయింటుకు ఏసీ కావాలని కోర్టులో పిటిషన్ వేయలేదు. అంటే దీని అర్థం ఏమిటి? - గురు, శుక్రవారాల్లో వాదనలు సాగినప్పుడు కూడా ఈ విషయాన్ని కోర్టులో అడగలేదు. - చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమా? లేక నిర్ణయించాల్సింది న్యాయస్థానమా? - కోర్టు ఏం చెబితే.. రాష్ట్ర ప్రభుత్వం అది చేస్తుంది. ఖైదీలకు ఏం ఇవ్వాలో, ఏం ఇవ్వకూడదో నిర్ణయించేది కోర్టు అయినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం మీద రాజకీయ విమర్శలు చేయడం పూర్తి దిగజారుడుతనం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. - ముందు క్వాష్ పిటిషన్ వేశారు. అది కుదరలేదు. దానిమీద హైకోర్టుకు వెళ్ళారు. కుదరలేదు. - ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు, కుదరలేదు. ఆ తర్వాత లూథ్రా కత్తులు-కటార్లు పట్టుకోమన్నారు. - ఆ తర్వాతే ఏసీబీ కోర్టులో ఏకంగా న్యాయవాదుల మీద దాడులు చేయించారు. ఆ తర్వాత, ఇప్పుడు బాబు ప్రాణానికి ముప్పు ఉందంటూ పచ్చి అబద్ధాల వాదన, డ్రామా మొదలు పెట్టి ఇదంతా చేస్తున్నారు.