అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
చదువులు బాగా చదవాలి...గొప్పగా ఎదగాలి
13 Nov 2019 4:41 PM
పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదన్నారు డాక్టర్ వైయస్సార్. ఆ దిశలో ముఖ్యమంత్రిగా... మరొకరికి ఆలోచనకు కూడా అందని రీతిలో కృషి చేశారు. పేదింటి పిల్లల చదువులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ది తండ్రి బాటే. తండ్రి ఒక అడుగు వేస్తే...తాను రెండడుగులు ముందుకు వేయాలన్న తాపత్రయమే.
చదువుల వెలుగులు పంచితే కుటుంబాలు వెలుగుతాయి. తరాలు మారుతాయి. సామాజిక గతివేగం పాజిటివ్ దిశలో సాగుతుంది. అభివృద్ది ఫలాలు అందుకోవడంలో సమాజంలోని అందరూ సమానభాగస్వాములు అవుతారు.
సీఎంగా వైయస్ జగన్ రాష్ట్రంలోని విద్యావ్యవస్థపై ప్రత్యేకశ్రద్ద చూపుతున్నారు. చరిత్రాత్మక నిర్ణయాలతో ప్రాధమిక విద్యనుంచే గట్టి పునాదులు పడేలా తపించిపోతున్నారు. ప్రభుత్వపాuý శాలలకు మహర్దశ కల్పించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నారు. చదువుల విషయంలో సీఎం జగన్ ఆలోచనల్లో దార్శనికత చెప్పుకోదగ్గది. పేదింటి పిల్లలకు అందించే పెద్ద ఆస్తి మంచివిద్యేనని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఆ దిశలో ఆయన ఆలోచనలు, ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయి. అటు మేధావివర్గాలు, ఇటు అమ్మానాన్నలు అందరూ హర్షించే లా చేస్తున్నాయి.
ప్రభుత్వబళ్లల్లో ఇంగ్లీషు మీడియంలో చదువులు అని సీఎం అనగానే అటు ప్రశంసలు, ఇటు విమర్శలు చెలరేగుతున్నాయి. కాస్త సంయమనంతో ఆలోచిస్తే, అందులోని మంచిచెడులు విశ్లేషిస్తే...మంచే మరింత మెరుగ్గా...ఎక్కువగా కనిపిస్తుంది. ఇంగ్లీషంటే బెరుకు పోగొట్టడానికి, నడుస్తున్న ప్రపంచంలో పోటీని తట్టుకోవడానికి ఆ భాష ఒక ఆయుధమన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. మరిన్ని మంచి సలహాలతో...విద్యాపరంగా రాష్ట్రం ముందంజ వేయడానికి అందరూ సహకరించాలి. చదువుల విషయంలోనూ విమర్శల పేరిట రాజకీయప్రయోజనాలకు వెంపర్లాడటం సిగ్గుచేటైన విషయం. వట్టిగా విమర్శలు చేస్తూ కూర్చుంటామంటే...’నేను అన్నం పెడతానంటే...మేము సున్నం పెడతామన్నట్టు’గా ఉంటుంది.
విద్యాప్రమాణాలు మెరుగుపరచాలని, విద్యార్థి ప్రతిభను సానపెట్టాలని, వారిలో నైపుణ్యాలను పెంచాలని...ప్రపంచంలో మేము సైతం అని సగర్వంగా తలెత్తుకుని జీవించేలా చేయాలన్న ఉన్నతాశయం సీఎం జగన్ది. అందుకు సర్కారు బళ్లను తీర్చిదిద్దడం, ప్రైవేటు ఫీజుల బెడద లేకుండా చేయడం, అమ్మ ఒడి పథకం ద్వారా పేదింటి బిడ్డలకు ఆర్థిక సాయం అందించడం ఆ ఆశయంలో భాగాలే.
నడుస్తున్న రాజకీయ చరిత్రలో చదువుల గురించి పట్టించుకోవడమే సరిపడని విషయం. అలాంటిది పేదపిల్లల చదువుల గురించి, సర్కారు బళ్ల గురించి ఆలోచించడమన్నది నేటి పొలిటీషియన్లలో చాలామందికి అర్థం కాని విషయం. తమ పిల్లలు కార్పొరేట్ స్కూళ్లలో చదివితే చాలు, పేదపిల్లలు ఏమైతే మాకేంటి? అన్న సంకుచిత ధోరణులతో ఆలోచించే వారికెవరికైనా, యువముఖ్యమంత్రి పెద్ద మనసు అంత సులువుగా అర్థమవుతుందనుకోవడం భ్రమే. తమ పిల్లలు బాగా చదవాలని, తమ కుటుంబాల తలరాతలు మారాలని అనుక్షణం పరితపించే పేద తల్లిదండ్రుల గురించి... ఆ ఇంటి మనిషిగా ఆలోచించడమన్నది ఆషామాషీ పొలిటీషియన్లకు అసలు సాధ్యం కాని విషయం. మంచి మనసున్న పాలకులకే అది సాధ్యమైన విషయం.
ఒక మంచి సంకల్పంతో ...అందరికీ మంచి చేయాలని... పాలనలో ముందడుగులేస్తూ ముందుకు సాగుతున్న వైయస్ జగన్ ఆశయాల బాట సామాన్యప్రజలకు వెలుగుబాట. పసిపిల్లల... బడిపిల్లల ఉజ్జ్వల భవిష్యత్తు దిశలో ప్రభుత్వ ఆలోచనలు సాగుతుండటం ఆందరూ ఆహ్వానించదగ్గ పరిణామం. నవంబర్ 14, బాలల దినోత్సవం రోజున... ’నాడు–నేడు’ పేరుతో తొలి అడుగులు పడుతుండటం విద్యాలోకంలో కొత్తశకానికి నాంది.