తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబునాయుడుకు బహిరంగలేఖ

  ఆగస్ట్19,2012
 చంద్రబాబుగారు.గడచిన కొన్నిరోజులుగా మీరు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే,ఈ రాష్ట్ర ప్రజలను తేలిగ్గా వంచించ వచ్చని;తొమ్మిదేళ్ళ పాలనలో మీ నిర్వాహకాలన్నీ వారికి ఏ మాత్రం గుర్తు లేవని మీరు విస్తున్నట్టుగా ఉంది.సబ్సిడీలు ఉండరాదని,వ్యవసాయం దండగని ప్రకటించిన మీరు రైతులు,నేతన్నలు,మత్స్యకారులు,గీతకార్మికులు,రజకులు,క్షురకులు,కుమ్మర్లు,కమ్మర్లు...ఇలా ఏ వృత్తిని ఎంచుకున్న వారికైనా పల్లెల్లో జీవించే అవకాశమే లేకుండా చేసిన మాట వాస్తవం కాదా? అలాంటి మీకు అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు ఉందా? అధికారంలో ఉండగా ఏ నాడైనమీరు బీసీల గురించి నిజాయితీగా ఆలోచన చేశారా?బీసీల గురించి ఇప్పుడు మొసలి కన్నీళ్ళు కారుస్తున్న మీరు వారికోసం ఏం చేశారంటే,ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన జనతా వస్త్రాల స్కీమును,ఆయనకు వెన్నుపోటు పొడిచి రద్దు చేశారు.బీసీలకు పెన్షన్లు ఇవ్వాలనో,ఒక పూట అయినా భోజనం దొరికేలా చేయాలనో మీ మొత్తం జీవితంలో ఏనాడైనా ఆలోచన చేసారా?నాలుగు జతల దుస్తులు స్కూలు పిల్లలకు ఇవ్వాలని,తద్వారా నేతన్నలకు మంచి చేయాలనీ మీరు అధికారంలో ఉన్న రోజుల్లో మీకు ఏనాడు అనిపించలేదే!బీసీలకు ప్రత్యేకంగా కార్పోరేషన్లు,పెడరేషన్లు పెట్టి వారికి అండగా నిలవాలని కూడా ఏనాడూ ఆలోచనే రాలేదే!తమరు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏ ఒక్కరోజైన ఏఒక్క కాలేజికి అయినా వెళ్లి,విద్యార్దులు ఎలా చదువుకుంటున్నారో  తెలుసుకోవాలని,ఆ చదువులకోసం పిల్లల తల్లితండ్రులు ఎన్ని కష్టాలు పడుతున్నారో గుర్తించి వాటిని పరిష్కరించాలని మీకు ఎప్పుడూఅనిపించలేదు.మీ పాలనలో పేదలకు ఏ విషయంలో భరోసా లబించింది కనుక? విద్య,వైద్యం,కూడు,గూడు...ఇలా ఏది చూసిన అప్పట్లో పేదలందరికీ మిగిలినది నిరాశ మాత్రమే.వైద్యం ఖర్చు భరించలేక పేదలు సర్వం అమ్ముకొని,తల తాకట్టు పెట్టి అప్పుల పాలవుతున్న మీ గుండె కరగలేదు.పేదల వైద్యం కోసం ఎంత ఖర్చు అయినా,నేనున్నానని భరోసా ఇచ్చే మంచి అన్నలా ఉండాలని మీకు ఏనాడూ అనిపించలేదు.సర్కారీ ఆసుపత్రులకు వచ్చేది నిరుపేద ప్రజలన్న నిజాన్ని కూడా గుర్తించకుండా యూజర్ చార్జీలు దారుణంగా వడ్డించారు.ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలని,అలా ఓ గూడును ఏర్పాటు చేయడంలో కులాలు,మతాలు,పార్టీలు అడ్డు రాకుడదనిమీరేనాడు భావించలేదు.ఆదరణ పధకం అంటూ పాలక్యాన్లు,ఇస్త్రీ పెట్టలు,జాలరి వలలు వంటివి బీసీలకు ఇచ్చాం అంటూ పనికి రాని సామాను కొద్దిగా పంచి...కాగితాల మీద అప్పట్లోనే మీరు లెక్క రాసుకున్నది అక్షరాల రూ 700కోట్లు.ఈ సొమ్ములో బీసీలకు కనీసం రూ కోటి అయినా దక్కిందా? మిగిలినదంతా మీ పార్టీ జేబులోకి చేరడం నిజం కాదా? ఏదో తూతూమంత్రంగా కొద్దో గొప్పో చేస్తే సరిపోతుందిలే అనే భావంతో బీసీల అభివృద్ధి అంటూ మోసం చేసారే తప్పా వారికి మీరు ఏనాడూ మంచి చేయలేదు.మీరు చెప్పేవన్నీ అబద్దాలే అన్నది మీ మూడున్నర దశాబ్దాల చరిత్ర.పదవికోసం ఎంతటి అబద్ధాన్నైన కన్నార్పకుండా చెప్పే నైజం మీది.ఇప్పుడు కూడా అలానే మీరు చెపుతున్న అబద్దం బీసీల మీద మీకున్న ప్రేమ.ఈ బహిరంగ లేఖ ద్వారా జగన్మోహన్రెడ్డి మాటగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను.మీరు కేవలం వంద టికెట్లు ఇస్తామంటున్నారు.దాని వల్ల బీసీలకు ఒరిగేది ఎంతో అందరికి తెలుసు.మేం చెపుతున్నాం...వంద టికెట్లు కాదు,అసెంబ్లీలో వంద సీట్లు వారికే కేటాయిద్దామని.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల మీద చర్చ జరుగుతునప్పుడు కూడా జగన్ బాబు ఒక ప్రతిపాదన చేసాడు.ఉన్నవి నాలుగు ప్రధాన పార్టీలు కాబట్టి అందరం కలసి కూర్చుని జనరల్ స్థానాల్లో నుంచి 33 శాతాన్ని మనమే లాటరీ ద్వారా ఎంపిక చేసి,అక్కడ అందరం బీసీలనే పోటీపెట్టాలని.స్థానిక సంస్టల్లో బీసీ రిజర్వేసన్ అంశం మీద కోర్టు కేసులు వాటి దారిన అవి జరుగుతున్నాయి కాబట్టి,ఈలోగా స్వచ్చందంగా మనమే చేద్దాం అన్నాడు.ఆ ప్రతిపాదన మీద మీరు కనీసం స్పందించలేదు.అంతే కాకుండా,చంద్రబాబూ మీరు ...2009 ఎన్నికల్లో ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకోండి.ఆ రోజు ఎన్నికల్లో బీసీలను మోసం చేయాలన్న కుట్ర పూరిత ఆలోచనతోనే కదా మీరు100 టికెట్లు ఇస్తామన్నారు? తీరా మీరు ఎన్నికల్లో ఇచ్చిన టికెట్లు 47మాత్రమే.మరి వైఎస్ గారు ఇచ్చినది అక్షరాల 67.ఇదీ మీ మాటకున్న విలువ!ఇదీ మీ బీసీ ప్రేమ!ఇదీ మీ నైజం!ఇప్పుడు కూడా నేను జగన్ బాబు చేసిన మరో ప్రతిపాదనను మీ ముందుకు తీసుకు వస్తున్నాను.రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ రిజర్వేడ్ స్థానాలను;మైనార్టి ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాలను మినహాయిస్తే,మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నిటిలో బీసీల జనాబా 25వేల పైనే ఉంటుంది.రండి ...మన రెండు పార్టీలు కూర్చుందాం.బీసీల జనాబా ప్రాతిపదికన ఏ 100 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు తప్ప వేరెవిరికి టికెట్లు ఇవ్వరాదో లాటరీ ద్వారా నిర్ణయిద్దాం.ఒకసారి వైఎస్సార్ కాంగ్రెస్,తెలుగుదేశం అలాంటి నిర్ణయానికి సిద్దపడితే ....కాంగ్రెస్స్ సహా మిగతా పార్టీలు కూడా దానికి అంగీకరించే అవకాశం ఉంది.బీసీల మీద మాటలు మాత్రమే కాదు....చేతల్లో కూడా ప్రేమచూపే పార్టీ మాది కాబట్టే ఈ ప్రతిపాదన మరోసారి చేస్తున్నాం.మీకు నిజాయితీ ఉందనుకుంటే,బీసీలకు మేలు చేసే ఉద్దేశమే ఉంటే మా ప్రతిపాదనను అంగీకరించండి...ఊరికే డిల్లీ వెళ్లి జరగని పనికి మీరు డ్రామా ఆడేకంటే,శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేద్దాం రండి.మనం చేసే ప్రతిపని,ప్రతి అడుగు...అన్ని పార్టీల తరపున కనీసంగా వందమంది బీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తలెత్తుకు నిలబడేలా ఉండాలి.                                                  
                                    

                      

Back to Top