వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పండగపూట పస్తులే..!
16 Oct 2015 2:28 PM
ధరల కట్టడిలో విఫలమైన ప్రభుత్వం..!
మంటెత్తిస్తున్న పప్పుల ధరలు..!
పండగవేళ పప్పుధరలు మంటెత్తిస్తున్నాయి. దీంతో, సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎంతసేపు చంద్రబాబు దోచుకున్న సొమ్ముతో రాజధానిలో చేయబోయే పండగ గురించి ఆలోచిస్తున్నారే గానీ, ప్రజల కష్టాలు మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో ఎన్నడూ లేనంతగా పప్పుధాన్యాల ధరలు ఆకాశన్నంటాయి. పండగ పూట పిండివంటల సంగతి దేవుడెరుగు కనీసం పప్పన్నం కూడా తినలేని పరిస్థితి దాపురించింది. పైపైకి ఎగబాతున్న ధరలతో పేదప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. జేబులు చిల్లులు చేసుకున్నా రెండు ముద్దలకు కూడ సరిపడా పప్పు ధాన్యాలు రావడం లేదు.
చోద్యం చూస్తోన్న ప్రభుత్వం..!
నెలరోజుల వ్యవధిలో రెట్టింపైన ధరలు సామాన్య ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కిలో చికెన్ తో పోలిస్తే పప్పుధాన్యాలు రెండింతల ధర పలుకుతున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐనా చంద్రబాబు ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. ఎలా దోచుకుందాం, ఎలా దాచుకుందామన్న పాలసీయే తప్ప...ప్రజలకు మేలు చేసే పాలన సాగించడం లేదు. శరీరంలో ప్రధాన పాత్ర వహించే పప్పుల సరఫరాపై దృష్టిసారించి, సామాన్యులకు అందుబాటులో ఉంచడంలో పచ్చసర్కార్ ఘోరంగా విఫలమైంది.
ధరలు దిగకపోతే పస్తులే..!
మార్కెట్లో ముచ్చెమటలు పట్టిస్తున్న పప్పుధరలు నెలరోజుల్లో... కిలో కందిపప్పు రూ. 140 నుంచి రూ.200కి పెరిగింది. రూ.135 ఉన్న మినప్పప్పు ప్రస్తుతం రూ.185 పలుకుతోంది. రూ.110 ఉన్న ఎండుమిర్చీ ఇప్పుడు రూ. 140కి చేరింది. శరీరానికి మెండుగా మాంసకృత్తులను అందించే పప్పుధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం చోద్యం చూడడంపై మండిపడుతున్నారు. ధరలను కట్టడిచేయకపోతే పండగపూట పస్తులు ఉండక తప్పదని వాపోతున్నారు.