స్పీకర్: శోభా నాగి రెడ్డి: జూలై 21, 2012

రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ అనుసరించిన వైఖరిని ఎవరైనా అర్ధం చేసుకుంటారు. తెలుగుదేశం పార్టీలోని భూకబ్జాల ఎమెల్యే రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్‌మీట్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ మానసిక స్థితి సరిగా లేదని సూచిస్తున్నాయి. "జగన్ బెయిలు ఖరీదు ప్రనభ్ ముఖర్జీకి ఓటు " గా మారిందంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యే వాఖ్యానించడం అ పార్టీ చట్టం, రాజ్యంగం, న్యాయస్థానాల పట్ల లెక్కలేని తనాన్ని వెల్లడిస్తున్నాయి.

సిబీఐమీదగాని, కాంగ్రెస్మీదగాని, తెలుగుదేశం పార్టీమీదగాని మా పార్టీ వైఖరిలో ఎలాంటి మర్పూ లేదు. మేం ఇంతకు ముందు చెప్పినట్టుగానే సిబిఐల మద్య కూడా అవినాభావ సంబంధాలున్నాయని మరోసారి సృష్టం చేస్తున్నాం. కుమ్మక్కు రాజకీయాలు, కుట్రలు, వెన్నుపోట్లు వంటివి తెలుగుదేశం పార్టీ పెంటేంట్లు. కాంగ్రెస్‌తో ఈ రాష్ట్రంలో ఎవరు కలిసిపోయరో ఒకటి కాదు.... రెండు కాదు, అనేక ఉదాహరణలున్నాయి. రైటు టు ఇన్ఫర్మేషన్(ఆర్టీఐ) కమిషనర్ల నియామకంలో కుమ్మక్కు అయింది ఎవరు? ఎమ్మెల్సీ అభ్యర్ధుల్ని నిలబెట్టి విషయం నుంచి ఓట్ల ట్రాన్స్‌ఫర్ వరకు కలిసి చేయించుకున్నది ఎవరు? వీటన్నింటికి ఈ రాష్ట్ర ప్రజలంతా ఒకే సంధానం చెపుతారు-తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలని! అలాగే, రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు ప్రసన్నం చేసుకోటానికి టీడీపీ నాయకుడు జి.ఎన్.నాయకు‌డుకు హైదరాబాద్ అమీర్‌పెట్‌‌లోని అత్యంత ఖరీదైన భుఉములను పట్టించడానికి పాలునీళ్ళలా కలిసిపోయినది కుడా ఈ రెండు పార్టీలే ఇది.

అది కాకపోయినాఎవరి చరిత్ర ఏమిటో రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. ఆరోపణలు చేసినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ ఒంటినిండా ఉన్న బురద గంధంగా మారిపోదు, అలాగే, సిబీఐతో తెలుగుదేశం, కాంగ్రెస్ సంయుక్తంగా కుమ్మక్కు అయ్యయన్నది కూడా ముమ్మాటికి నిజం. లేని పక్షంలో ఎకర నలుగు కోట్లు విలువ చేసే భూముల్ని ఈమార్ సంస్థకు ఎందుకు కట్టబెట్టారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును సిబిఐ ఎందుకు ప్రశ్నించడం లేదు? అదీగాక, చంద్రబాబుకు సంబంధం లేని సిబిఐ వెనువెంటనే. క్లీన్ చిట్ఇచ్చి ఆయనకు లేని పరువూ ప్రతిష్టల్ని కాపాడే బాధ్యత తన భుజస్కందలమీద ఎందుకు వేసుకున్నట్టు? ఇదే సిబిఐ, తనయుడైన లోకేష్‌కు సత్యం రామలింగరాజు ఫీజు కట్టారన్న విషయాన్ని ఎందుకు దాచేపెడుతున్నట్టు? ఆ కేసులో కుడా చంద్రబాబుమీద విచారణే లేదు... ఎందుకని? ఇవి చాలవా, సిబిఐ-తెలుగుదేశం-కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యరనటానికి?

ఈ రోజు పత్రికలనే చుడండి. అందులో ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచిరించిన కథనాన్ని ప్రచురించాయి. ఎవరో చెప్పిన మాటలను పత్రికలు ప్రచురించరాదని పార్టీని మేం భావించడం లేదు. కాకపోతే, క్రిందిస్థాయి కోర్టులో బెయిల్‌కు రూ.100 కోట్లు ఇస్తామని ఎవరైనా అనే అవకాశం ఉందా పత్రికా ప్రమాణాల రీత్యా ఆలోచనైన ఉండదా అన్నదే మా ప్రశ్న. ఇలాంటి చెత్త కథనాలను ఏరుకుని ఎల్లో మీడియా పత్రికలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రొజూ గంగావేర్రులేత్తుతుంటే..... మేరోవంక, తెలుగుదేశంపార్టీ ఏకంగా బెయిలును 'ఖరీదు' కట్టరంటూ రేవంత్ రెడ్డితోనో మరోకరితోనో మాట్లాడిస్తోంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టులో ఉన్నదని తెలిసి ఇలా 'ఖరీదు' అంటూ మాట తూలటం ఆ పార్టీ మానసిక స్థితితోపాటు, రాజకీయ స్థాయిని కూడా సూచిస్తోంది.

మేం తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాం... మీ నాయకుడి మాదిరిగా మేనేజ్ చేసుకునే వ్యక్తులమే అయితే, హైకోర్టులో పిటిషన్ పడకముందే మేనేజ్ చేసి ఉండేవాళ్ళం కదా? ఆ తర్వాత, ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ముందే మేనేజ్ చేసి ఉండేవాళ్ళం కదా? అలాంటిదేమీ లేనప్పుడు, అలాంటి అలవాట్లు మా రక్తంలోనే లేనప్పుడు మీరు ఎన్ని విమర్శలు చేసిన ఎం లాభం?
ప్రస్తుత లోక్‌‌సభలోనే కాకుండా, మోతంగా దేశ చరిత్రలో ప్రజా తీర్పులో అత్యదికంగా మెజారిటీ సంపాందించిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి రేపటి రోజున న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తే అది తప్పు అవుతుందా..? అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేసారు? తప్పు చేశారన్న ఆధారాలతో కాదు. అయన ఒక ఎంపీ. అయన ఒక పార్టీకి అధ్యక్షులు , కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేస్తారంటూ అరెస్ట్ చేశారు. నిజానిజాలను బేరీజు వేసి, ఈ అరెస్టు సబబు కాదంటే, రేపు సుప్రీం కోర్టు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇస్తే దాన్ని మీ పార్టీ ''ఖరీదు" గా భావిస్తుంద..? ఆవిర్బవించి ముప్పైఎల్లైన మీ పార్టీకి ఏది అనోచే, ఏది అనకూదదో అన్న జ్ఞానం కూడా లేదే!

ఇక ప్రణబ్ ముఖర్జీకి మా పార్టీకి మద్దతు ఇవ్వటానికి మీరు తప్పుపడుతున్నారు. ఏదో ఆశించే ఆయనకు మేం మద్దతు ఇచ్చాం అంటున్నారు. చివరికి దేశంలో అత్యునత రాజ్యాంగ పీఠానికి పార్టీకి అతీతంగా జరుగుతున్న ఎన్నికలను కూడా మీ పసుపురంగు పార్టీ పచ్చకామెర్ల దృష్టితోనే చూస్తోంది. మీ వాదనే నిజం అనుకుంటే, మరి లోక్‌సత్తా, సిపిఎం లాంటి పార్టీలు ఎం ఆశించే ప్రసబ్‌కు ఓటు వేశాయి? మీరెందుకు వారిని విమర్శించాలేకపోతునారు? మీ రాజకీయ అవసరాల దృష్ట్యా వారి విషయం లో మీరు నోరేత్తటం లేదు. అవునా? అదిగాక, దేశ రాష్ట్రపతి ఎన్నిక టీ-20 మ్యాచ్లాంటిదా? గెలుపు ఎవరిదో నామినేషన్ల పర్వానికి ముందే తెలిసిపాయింది.

కాబట్టి చంద్రబాబు నాయుడు ఓటు వేయకుండా వెనక్కు తగ్గారు. 'తటస్థం' అన్నది కేవలం ప్రజలను మబ్యపెట్టాలన్న కుట్రతో తెలుగుదేశం పార్టీ పన్నిన పన్నాగంలో భాగం మాత్రమే. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవికి పోటి చేస్తునరన్న వార్త వినగానే అయున్ను చంద్రబాబు సమర్దించిన మాట వాస్తవం కాదా? ఆయనకు మద్దతుగా నిలబడాలని కొన్ని పార్టీల నాయకులతో సాక్షాత్తు చంద్రబాబు చాటుమాటు మంతనాల చేయటం నిజం కాదా? రాష్ట్రములో ప్రధాన ప్రత్యక్షంగా ఉండి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయకుండా ఎలా ఉంటామని చంద్రబాబు అనటం నిజం కాదా? సంగ్మాకు మద్దతు మాత తత్వానికి మద్దతు అని చంద్రబాబు పేర్కొనటం నిజం కాదా? ఇవన్ని నిజాలే అయిన అంతకు మించిన నిజం ఏమిటంటే, బాబు బుకాయించగలరు. ఒకప్పుడు ఓటు వినియోగించుకోనకపోవడం, తటస్థంగా ఉండటం తప్పు అన్న బాబు ఇప్పుడు కొత్త రాజకీయాలు మొదలుపెట్టారు. రాజకీయ నాయకులుగా మనమంతా ఎన్నికలు వచ్చేసరికి ఓటు వేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటాం. అలాంటిది, బాధ్యత కల్గిన ఒక రాజకీయ పార్టీలో ఉంటూ దేశ ప్రధమ పౌరుడికి ఎన్నుకునే ప్రక్రియలో వెనుకడుగు వేయటం అంటే, భావి తరాలకు ఎలాంటి సందేశం పంపుతున్నట్లు? ఇలాంటి కనీస ఆలోచనలు కూడా తెలుగుదేశం పార్టీ వారికీ రావెందుకని?

న్యాయ వ్యవస్థకు సంబదించిన చెలగాటం ఆడటం తెలుగుదేశం పార్టీకి బహుశా వెన్నతోపెట్టిన విద్య అయి ఉండవచ్చు. పచ్చ పార్టీ వారికీ కూడా ఇలా కుమ్మక్కు కావటం, మేనేజ్ చేసుకోవటం వారి స్వభావ సిద్దమైన గుణాలు అయినందున వాటిని మిగితా పార్టీలకు అంటగడుతున్నట్టుగా కనిపిస్తోంది. మాది మేనేజ్ చేసుకునే పార్టీ కాదు కాబట్టే న్యాయస్థానాల్లో పోరాటాన్ని కొనసాగిస్తోంది.

అదిగాక, మేం ఈ ఎన్నికల్లో ఓటు వేయం అని వైయస్అర్ కాంగ్రెస్ ప్రకటించి ఉంటే, ఇది రాజకీయాల్లో ఒక చెడ్డ సంప్రదాయం అని తెలుగుదేశం పార్టీ విమర్శించేది. సంగ్మాకు అనుకూలంగా ఓటు వేస్తె అది ముస్లింలకు వ్యతిరేక ఓటు అని యాగి చేయటానికి తెగించేది. ప్రణబ్ ఓటు వేయటాన్ని కుమ్మక్కుగా పేర్కొంటుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న ''మేనేజ్‌మెంట్'' అనే పదం మాత్రమే తెలుగుదేశం పార్టీ వారి నోటినుంచి వస్తుంది.

మేం తెలుగుదేశం పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నాం....మేం మీకు మాదిరిగా గొప్ప మేనేజర్లమే అయి ఉంటే, తనే మీద కేసులు ఎలా విచారణకు రాకుండా అడ్డుకోవాలో, అపుకోవాలో చంద్రబాబు ఏళ్లుగా ప్రదర్శిస్తున్న విద్యలన్నీ మేం ప్రదర్శించి ఉండేవాళ్ళం కదా? మేం ఏనాడూ అలా నీచ స్థాయికి దిగజార లేదే! ఈమార్ కేసులో చంద్రబాబు సిబిఐ కనిసం ప్రశ్నించటానికి కూడా పిలవకుండా మేనేజ్ చేసుకున్నట్టుగానే మేం కూడా మేనేజ్ చేసుకొని ఉండేవాళ్ళం కదా? అలాంటి అలవాట్లే ఉంటే, కేసే లేకుండా... సిబిఐ దర్యప్తే లేకుండా.... అరెస్టే లేకుండా.... ఇలా... అన్నింటిని మీకు మాదిరిగానే మేం కూడా మేనేజ్ చేసి ఉండేవాళ్ళం కదా? వీటన్నింటినీ వైయస్ఆర్ కాంగ్రెస్, దాని అధ్యక్షుడు దూరంగా ఉండబట్టే... అయన నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసి జననేత కాబట్టే ... ఎన్నాళ్ళు బతికాం అన్నది కాకుండా ఎలా బతికాం అన్నది మాత్రమే ముఖ్యం అనే భావజాలం ఉన్న నాయకుడు కాబట్టే తెలుగుదేశం పార్టీ మాదిరిగా అయన ఎవరితోనూ కుమ్మక్కు కాలేదు. ఏ వ్యవస్థల్ని మేనేజ్ చేయలేదు. ప్రజల గుండెల్లో ఉండటం ప్రదానం అనుకున్నారు కాబట్టే, జైళ్ళలో ఉన్నా లక్ష్యం పెట్టకుండా పోరాటాలు చేస్తున్నారు.

వీటన్నింటికీ మించి, మా పార్టీ తరుపున స్పష్టమైన విజ్ఞప్తి చేశాం-ఎవరది కుమ్మక్కు రాజకీయ తేల్చుకుందామని. సంఖ్యాపరంగా ప్రధాన అనిపించుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఈ సవాలును స్వేకరిస్త్, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సవాలు విసిరాం. తెలుగుదేశం పార్టీ ఇంకా ఏ కొంచమైనా చిత్తశుద్ది మిగిలి ఉంటె మా సవాలును స్వీకరించాలి. మా పార్టీ నాయకుడి అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిన, ప్రజలు ఎవరిని నమ్ముతున్నరన్నది మొన్నటి ఉప ఎన్నికల్లో తేలిపోయింది. ఆ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు. ఆ రెండు పార్టీలకు కలిపి వచ్చిన ఓట్ల కన్నా ఒక్కటిగా వైయస్ఆర్ కాంగ్రెస్‌కు ఆరు శాతం ఓట్లు ఎక్కువగా దక్కాయి. అలాంటప్పుడు మాకేం ఖర్మ, అంపశయ్యమీద ఉన్న రాజకీయ పార్టీలతో కుమ్మక్కు కావటానికి? అదీగాక, ఈ క్షణంలో ఎన్నికలు పెట్టినా, 2014లో ఎన్నికలు జరిగినా... ఇప్పటికి మృత ప్రాయంగా మారిన ఈ రెండు పార్టీలకు మరెంతటి పరాభవం ఎదురుకోబోతోందో అందరికి తెలుసు. అలాంటప్పుడు కుమ్మక్కు కావాల్సిన అవసరం వైయస్ఆర్ కాంగ్రెస్ ఉండ, లేక తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు ఉండ అన్నది సుస్పష్టం.

Back to Top