చిత్తూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన 50వ రోజు ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితం ముగిసింది. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి పులవండ్ల పల్లి, కాశీరావు పేట, వాల్మీకిపురం, ఐటీఐ కాలనీ, పునుగుపల్లి, విఠలం, టీఎమ్ లోయ మీదుగా జమ్మిలవారిపల్లి వరకు పాదయాత్ర కొనసాగింది.