211వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం


తూర్పుగోదావ‌రి: వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 211వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం నైట్‌క్యాంప్‌ శివారు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి ఉలపల్లి వరకు పాదయాత్ర  కొనసాగుతుంది. బుధవారం మండపేట నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకొన్న జననేత, అనపర్తి నియోజక వర్గంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నియోకవర్గ ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.


Back to Top