తూర్పు గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. సోమవారం ఉదయం వైయస్ జగన్ పెద్దపూడి మండలం మామిడాల శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి పెద్దడ, కికవోలు, పెద్దపూడి చేరుకున్న తర్వాత జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం దొమ్మాడ, కరుకుడురు వరకు పాదయాత్ర కొనసాగనుంది.