ప్రారంభ‌మైన 96వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌


ఒంగోలు: ప‌్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్  రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 96వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గం హ‌జీస్‌పురం నుంచి ప్రారంభించారు. అక్క‌డి నుంచి కాంతంవారి ప‌ల్లి క్రాస్‌, చిన్న ఎర్ల‌పాడు క్రాస్‌, పేరంగుంట కొత్త‌ప‌ల్లి క్రాస్‌, చింత‌ల‌పాలెం, శంఖ‌వ‌రం, క‌నిగిరి మీదుగా ట‌కారిపాలెం వ‌ర‌కు పాద‌యాత్ర చేనున్నారు. పాద‌యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్‌ చింత‌ల‌పాలెంలో పార్టీ జెండాను ఆవిష్క‌రించ‌డంతో పాటు క‌నిగిరి బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించ‌నున్నారు. అనంత‌రం ట‌కారిపాలెంలో జ‌నంతో మ‌మేక‌మ‌వుతారు. ట‌కారిపాలెంలోనే రాత్రి బ‌స‌చేయ‌నున్నారు. 

తాజా వీడియోలు

Back to Top