ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్న చంద్రబాబు

హైదరాబాద్ః
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ను ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో
మాట్లాడుతూ టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారంటూ సీఎం తీరుపై ఉమ్మారెడ్డి
 మండిపడ్డారు. ప్రజాదరణ పొందిన వైఎస్ఆర్ సీపీ నేతలను అక్రమంగా
నిర్బంధిస్తున్నారని పచ్చప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి
ఇలాంటి చర్యలు మంచివి కావని ఉమ్మారెడ్డి  టీడీపీ సర్కార్ కు హితవు పలికారు.
Back to Top