చంద్రబాబు హయాంలో అన్నీ కుంభకోణాలే


విజయవాడ:

నిజాం చక్కెర కర్మాగారాన్ని విక్రయించడం వల్ల రూ.308 కోట్లు నష్టం వస్తుందని అప్పటి ఐఏఎస్ అధికారి పి.సి.పరే‌ఖ్ చెప్పినప్పటికీ చంద్రబాబు‌ నాయుడు పచ్చచొక్కాలకు అప్పనంగా ధారాదత్తం చేశారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ తూర్పారపట్టారు. తన లాభం కోసం చిత్తూరు డెయిరీని అడ్డగోలుగా మూయించేసి, హెరిటేజ్ సంస్థలను స్థాపించి దేశవ్యాప్తంగా ఆయన  విస్తరించుకున్నారని దుయ్యబట్టారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు పచ్చచొక్కాలకు మినహా ఎవరికీ మేలు చేయలేదన్నారు. చంద్రబాబు పరిపాలన మొత్తం కుంభకోణాలే అని శ్రీమతి విజయమ్మ ధ్వజమెత్తారు. ‘వైయస్ఆర్‌ జనభేరి’ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె మంగళవారంనాడు కృష్ణా జిల్లా గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లోని 11 గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు.

‘మాజీ ఐఏఎస్ అధికారి పి.సి. పరే‌ఖ్ ‘క్రూసేడ‌ర్ ఆ‌ర్ కా‌న్‌స్పిరేటర్’ అనే పుస్తకంలో నిజాం షుగర్సు విషయం రాసినట్లు పత్రికల్లో చదివాను. మద్యం, ఏలేరు, తెల్గీ, నీరు-మీరు, పనికి ఆహార పథకం, ఐఎంజీ, ఎమ్మార్ కుంభకోణాల్లో చిక్కుకున్న చంద్రబాబు‌ నాయుడు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకొని బతుకుతున్నారు’ అని శ్రీమతి విజయమ్మ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Back to Top