గుంటూరు: పిడుగురాళ్ల పట్టణంలో బుధవారం నుంచి జరిగే గడపగడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని దాచేపల్లి పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్హుస్సేన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిలు పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటారని ఆయన తెలిపారు.