బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు
సాహితీ దిగ్గజం రావూరి మృతికి జగన్ సంతాపం
19 Oct 2013 1:38 PM
హైదరాబాద్, 19 అక్టోబర్ 2013:
తెలుగు సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దేశ సాహిత్యంలో అత్యున్నత పురస్కారం తలుపు తట్టిన ఆరు నెలలకే రావూరి దైవంలో ఐక్యమయ్యారని శ్రీ జగన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
`రావూరి అక్షరం... వాన చినుకు మట్టిబెడ్డను తాకితే అ మట్టి వెదజల్లే పరిమళం. ఆయన రచన ఒక వ్యాపకం కాదు.. అది ఒక దీక్ష. ఆయన జీవితం నిష్టతో కూడిన సందేశం. జ్ఞానపీఠ్ అవార్డు స్వీకరించిన కొద్ది రోజులకే రావూరి భౌతికంగా కనుమరుగు కావటం పట్ల నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రావూరి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నాను' శ్రీ జగన్మోహన్రెడ్డి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.