నెల్లూరు :తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి సింగపూర్, మలేషియా, హాంకాంగ్ లాంటి పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ఆరోపించారు. ఆయన పలు విదేశీ సంస్థలతో లావాదేవీలు చేశారన్నారు. తరచు తాను పేదవాడినని చెప్పుకొనే సోమిరెడ్డికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయిని ఆయన ప్రశ్నించారు. సోమిరెడ్డి లావాదేవీలపై సీబీఐ విచారణ జరిపించాలని కాకాణి డిమాండ్ చేశారు.