పర్ణశాల వద్ద ముగిసిన షర్మిల యాత్ర

విజయవాడ:

కృష్ణ జిల్లా పర్ణశాల వద్ద మరో ప్రజా ప్రస్థానం 108వ రోజు పాదయాత్ర ముగిసింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఆమె 1475.7 కిలోమీటర్లు నడిచారు. సోమవారం ఆమె జుజ్జవరం, నిడుమోలు గ్రామాలలో రచ్చబండ కార్యక్రమాలలో మహిళలతో ముచ్చటించారు. వారి కష్టాలు తెలుసుకుని వారికి భరోసా కల్పించారు.

Back to Top