పరిమెళ్లలో మహానేత వైయస్ విగ్రహావిష్కరణ

‌పరిమెళ్ళ (పశ్చిమగోదావరి జిల్లా),

22 మే 2013: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం సాయంత్రం పశ్చిగోదావరి జిల్లా పెంటపాడు మండలం పరిమెళ్ల చేరుకుంది. తమ గ్రామానికి వచ్చిన శ్రీమతి షర్మిలకు వైయస్ అభిమానులు, వైయస్‌ఆర్ ‌కాంగ్రె‌స్ కార్యకర్తలు ఘన‌ంగా స్వాగతం పలికారు. పరిమెళ్లలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని‌ శ్రీమతి షర్మిల ఆవిష్కరించి, నివాళి అర్పించారు. తరువాత స్థానికుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

Back to Top