ఎమ్మెల్యేలను కొనగలరేమోగానీ.. ప్రజలను కాదు

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ కుయుక్తులను రాష్ట్రపతికి వివరిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఈ నెల 25వ తేదీన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అంద‌రూ క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలపై రాష్ట్రపతికి తెలియజేస్తామన్నారు. ఈ నెల 23న సేవ్ డెమోక్రసీ పేరుతో నిరసనలతోపాటు జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని వివ‌రించారు. ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ ఉన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ టీడీపీ నేతలను కోలగట్ల ప్రశ్నించారు. తాను, తన కొడుకు శాశ్వతంగా అధికారంలో ఉండాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. దోచుకున్న నగదుతో ఎమ్మెల్యేలను కొనగలరేమోగాని...ప్రజలను మాత్రం కొనలేరన్నారు. తెలంగాణలో తమ ఎమ్మెల్యేలు పార్టీని వీడితే గగ్గోలు పెడుతున్న టీడీపీ నేతలు... ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం ఎంతవరకు సమంజసం అని   కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు.
Back to Top