<span style="text-align:justify">ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు చంద్రబాబు సర్కార్ కుట్రలు పన్నుతోంది. కౌన్సిలర్లను ప్రలోభాలు పెట్టి లాక్కోవడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. విప్ జారీ చేయడంతో ఇప్పటి వరకు టీడీపీకి మద్దతు పలికిన కౌన్సిలర్లంతా మళ్లీ వైయస్ఆర్ సీపీలో చేరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకునే అవకాశం ఉండటంతో ఎన్నిక వాయిదా వేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోంది. <br/></span>