వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఎమ్మెల్యేలను పశువులతో పోలుస్తారా?
20 Nov 2012 10:10 AM
వైరా 20 నవంబర్ 2012 : ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలను చంద్రబాబు పశువులతో పోల్చడం ఆయన కుసంస్కృతికి నిదర్శనమని వైయస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ రావు వ్యాఖ్యానించారు. ఖమ్మంజిల్లా వైరాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు నీతులు వల్లిస్తే ప్రజలు నమ్మేస్థితుల్లో లేరన్నారు.పాదయాత్ర పేరుతో బాబు గ్రామాల్లోకి రావడాన్ని ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ వివిధ పార్టీల నుంచి జనం భారీగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, జలగం వెంకట్రావు చేరికతో ఖమ్మం జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రం లో తెలుగుదేశం, కాంగ్రెస్ మరణశయ్యపై ఉన్నాయన్నారు.