కుమ్మక్కు రాజకీయం మానుకో బాబూ: సామినేని

విజయవాడ, 12 నవంబర్‌ 2012: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కుమ్మక్కు రాజయాలు మానుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సామినేని ఉదయభాను హితవు పలికారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం మైనార్టీలో పడిందన్నారు. మైనార్టీలో పడిపోయిన ఈ అసమర్థ ప్రభుత్వంపై ఇప్పుడైనా చంద్రబాబు అవిశ్వాసం పెట్టాలని ఆయన సోమవారంనాడు విజయవాడలో డిమాండ్‌ చేశారు. శాసనసభ శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేసి, సభలో తన బలాన్ని అధికార కాంగ్రెస్‌ పార్టీ నిరూపించుకోవాలని ఉదయ భాను సవాల్ ‌చేశారు.

తాజా వీడియోలు

Back to Top