నెల్లూరు : యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ సోషల్ మీడియా చైర్మన్గా పనిచేసిన కేతంరెడ్డి వినోద్రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువత, విద్యార్థులతోపాటు అన్నివర్గాల ప్రజల కోసం వైయస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అవిరళ కృషికి ఆకర్షితుడనై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో చేరినట్లు కేతంరెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, ప్రజలు తమ సమస్యలను జననేతకు చెప్పుకొని సాంత్వన పొందుతున్నారన్నారు. ప్రజల పక్షాన వైయస్ జగన్ చేస్తున్న పోరాటాలకు ఆకర్శితుడనైయ్యానని, మళ్లీ రాజన్న రాజ్యం జగనన్న తెస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు.