‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
జనం పక్షాన నిలిచిన జగన్కు జైలా?
28 May 2013 2:39 PM
హైదరాబాద్, 28 మే 2013:
ప్రజల పక్షాన నిలిచిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎం.పి. శ్రీ జగన్మోహన్రెడ్డిని జైలులో పెట్టారని ఆయన సతీమణి శ్రీమతి వైయస్ భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన మాట్లాడేవారు ప్రజల్లో ఉండకూడదన్నదే కాంగ్రెస్, టిడిపి నాయకుల ఉద్దేశమన్నారు. అందుకే శ్రీ జగన్ను జైలుకు పంపారని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకుండా ఏడాది కాలంగా జైలులో పెట్టడం అన్యాయం అన్నారు. హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మంగళవారం జరిగిన నిరసన దీక్షలో శ్రీమతి విజయమ్మతో పాటు పాల్గొన్న శ్రీమతి షర్మిల మీడియాతో మాట్లాడారు.
దేవుడు ఉన్నాడని, న్యాయం తప్పక జరుగుతుందని శ్రీమతి భారతి ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వల్లే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందని ఆమె గుర్తుచేశారు. ఈ రోజు మంత్రులుగా ఉన్నవారందరూ రాజశేఖరరెడ్డి వల్లే మంత్రి పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్నే ఇన్ని కష్టాలు పెడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని శ్రీమతి భారతి ప్రశ్నించారు.