జగన్‌ను ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యం: పెద్దిరెడ్డి

మదనపల్లి(చిత్తూరు జిల్లా), 15 మే 2013:

చిత్తూరు జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి.  మాజీ మంత్రి, పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో బుధవారం మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడపగడపకు  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే తమ లక్ష్యమన్నారు. అందుకోసం తాము కృషి చేస్తామని తెలిపారు. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో గడపగడపకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Back to Top